సాక్షి, అమరావతి: ‘‘పేదలకు చెందిన భూముల స్వాధీనంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నిలిపివేస్తాం. పేదలకు ఇచ్చిన భూములను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే విధానాన్ని రద్దు చేస్తాం. పరిశ్రమల పేరుతో దళితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తాం. దళితులకు న్యాయం చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండెకరాల చొప్పున కొనుగులు చేసి పంపిణీ చేస్తాం’’... ఇదీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ.
వీలైనంత త్వరగా సేకరించండి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పేదల పొట్టకొట్టి పెద్దల జేబులు నింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ప్రధానంగా పేదల భూములపైనే సర్కారు గురి పెట్టింది. పేదలకు జీవనోపాధి కోసం గతంలో కేటాయించిన అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా లాక్కొని, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోంది. విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక నోడ్స్ పేరుతో 20,603.65 ఎకరాల పేదల భూములను, 22,015.27 ఎకరాల పట్టా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పటికే పరిశ్రమల శాఖ గుర్తించింది. గుర్తించిన భూములను వీలైనంత త్వరగా సేకరించి, ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. నాలుగు పారిశ్రామిక నోడ్స్ కోసం అసైన్డ్, పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 61,315.38 ఎకరాలను గుర్తించింది.
చట్టమంటే లెక్కలేదా?
చట్టం ప్రకారం.. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయరాదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకున్న భూమిని తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికే ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు చరమగీతం పాడేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కోసం పైసా కూడా ఖర్చు చేయకపోగా, వారి భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వమే లాగేసుకోవడం బాధాకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
పేదల భూములే టార్గెట్
Published Fri, Mar 2 2018 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement