రాజధానిలో హైటెన్షన్ | High Tension In Amaravati | Sakshi
Sakshi News home page

రాజధానిలో హైటెన్షన్

Sep 17 2018 10:12 AM | Updated on Mar 21 2024 8:18 PM

అసైన్డ్‌ భూముల రైతులు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముట్టడికి పిలుపున్వివటంతో అమరావతిలో హైటెన్షన్‌ నెలకొంది. సోమవారం ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి రైతులు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్‌ భూముల రైతులకు అన్యాయం చేస్తోందని అసైన్డ్‌ భూముల రైతులు ఆరోపించారు. తమకు కూడా పట్టా భూములతో పాటు సమాన ప్యాకేజీ ఇ‍వ్వాలని, రైతు కూలీలకు ఒక్కొక్కరికి నెలకు 9000 పింఛన్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అసైన్డ్‌ భూముల రైతుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement