
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో కోలాహలంగా జరిగాయి

ముఖ్యమంత్రి పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆధ్వ ర్యంలో 600 కిలోల కేక్ను ట్రాలీపై ఉంచి గొల్లపూడి మైలురాయి సెంటర్ నుంచి భారీ ఊరేగింపుగా పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తదితరులు కేక్ కట్ చేసి సీఎం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












