ఆకాశానికి చిల్లు పడలేదు.. మేఘాలేమీ ఉరమలేదు.. కురిసింది కేవలం ఒక్క సెంటీమీటర్ వర్షమే!. మంగళవారం స్వల్ప వర్షానికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఐటీ కారిడార్, లక్డీకాపూల్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అత్యధికంగా కూకట్పల్లిలో 1.2 సెం.మీ, కొన్ని ప్రాంతాల్లో సెం.మీ లోపు వర్షపాతం నమోదైంది.


