
ఈ జల సిరులను తిలకించారా.. ఈ పక్కనే ఎడారిని తలపిస్తున్న చిత్రాన్నీ చూశారుగా. ఇది అంబర్పేట్లోని ఒకప్పటి బతుకమ్మ కుంట. ఆక్రమణలు, పూడికలు, చెత్తా చెదారంతో నిలువెల్లా నిర్లక్ష్యానికి గురైన తటాకం. ఒకప్పుడు నీటి గలగలలతో నిండైన రూపాన్ని సంతరించుకున్న ఈ బతుకమ్మ కుంట అనంతర కాలంలో అన్యాక్రాంతానికి బలైంది. స్వార్థపరుల చేతుల్లో పడి తన అసలైన ఉనికినే కోల్పోయింది. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మ కుంట కొత్త బతుకును పురుడుపోసుకుంది.

కబ్జాకోరుల నుంచి విముక్తి కల్పించి.. చెరువు విస్తీర్ణాన్ని పెంచి హైడ్రా పునరుజ్జీవం పోసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అకుంఠిత దీక్షతో కొత్త రూపు దాల్చింది.

ఇలాగే నగరంలో చెర వీడిన పలు చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి.

తొలిదశలో వివిధ ప్రాంతాల్లోని ఆరింటిని కబ్జాల బారి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు.

ఇలా.. సరస్సులు శిరస్సులు పైకెత్తి తాము బతికామంటూ జల వనరుల సాక్షిగా అలల సవ్వడులతో ఆనందిస్తున్నాయి.

పునరుజ్జీవం పొందిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు.











