తమిళనాడులోని మధురైలో అరవింద్ కంటి ఆస్పత్రి వద్ద తెలుగువారు ఆందోళనకు దిగారు.
మధురై: తమిళనాడులోని మధురైలో అరవింద్ కంటి ఆస్పత్రి వద్ద తెలుగువారు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి వరుసలో నిలబెట్టి ఇప్పుడు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టారు.
కేవలం తెలుగువారినే లక్ష్యంగా చేసుకుని ఆస్పత్రి బయటకు గెంటేశారని వారు ఆరోపించారు. తమ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చామన్న కనికరం లేకుండా రోడ్డుకు మీదకు గెంటేశారని వాపోయారు.