సోనియాతో ఏచూరి కీలక చర్చలు | Presidential poll on mind, Sitaram Yechury meets Sonia Gandhi | Sakshi
Sakshi News home page

సోనియాతో ఏచూరి కీలక చర్చలు

Apr 21 2017 11:20 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాతో ఏచూరి కీలక చర్చలు - Sakshi

సోనియాతో ఏచూరి కీలక చర్చలు

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ, సీపీఎం ముందడుగు వేశాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని పోటీ పెట్టడంపై సోనియాతో ఏచూరి చర్చించినట్టు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో ఇంతకుముందే నిర్ణయించింది.

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ కూడా గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్‌ కోరినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement