కలుషిత ఆహారం తిని 350 మందికి అస్వస్థత | Over 100 students fall ill after eating midday meal in Bangalore school | Sakshi
Sakshi News home page

కలుషిత ఆహారం తిని 350 మందికి అస్వస్థత

Sep 19 2014 6:00 PM | Updated on Oct 5 2018 6:48 PM

కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న350 మంది పైగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు లోనయైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న350 మంది పైగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు లోనయైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరులో  ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న అనంతరం తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఆ విద్యార్థులు ఆహారం తీసుకున్న అనంతరం తలనొప్పి, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందిపడటంతో డాక్టర్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది వైద్యం తీసుకున్న తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా చాలామంది విద్యార్థులకు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement