తెలియకచేసే తప్పుల్ని వేరుగా చూడాలి | Need to separate ‘innocent mistakes’ from serious crimes: SEBI | Sakshi
Sakshi News home page

తెలియకచేసే తప్పుల్ని వేరుగా చూడాలి

Dec 30 2013 1:38 AM | Updated on Sep 2 2017 2:05 AM

స్టాక్ మార్కెట్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ మోసాలను ఎదుర్కోవడానికి త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు.

 ముంబై: స్టాక్ మార్కెట్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ మోసాలను ఎదుర్కోవడానికి త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీల స్టాక్స్‌లో ట్రేడింగ్‌కు సంబంధించి టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, బ్రోకర్లు, ఇతరత్రా ఇన్వెస్టర్లు, సంస్థలు ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడకుండా నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. అయితే, తీవ్రమైన నేరాలకు తెలియకుండా చేసే ఉల్లంఘనల మధ్య స్పష్టమైన విభజన అనేది ఉండాలని, కొత్త నిబంధనల్లో వీటిని చేరుస్తామని కూడా ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ, అన్నిపక్షాల అభిప్రాయలనూ పరగణనలోకి తీసుకొని వీటిని ఖరారు చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement