ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు | Manish Tewari condemned the sena protest | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు

Oct 19 2015 1:25 PM | Updated on Oct 8 2018 5:45 PM

ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు - Sakshi

ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు

భారత్ పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సిరీస్ను నిర్వహిచకూడదంటూ బీసీసీఐ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనను కాంగ్రేస్ పార్టీ తీవ్రంగా ఖండించింది

భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సిరీస్ను నిర్వహిచకూడదంటూ బీసీసీఐ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనను కాంగ్రేస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై కాంగ్రేస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని అన్నారు.

 

ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం'గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇటీవల శివసేన కార్యకర్తల నిరసనలతో.. పాకిస్థానీ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమం రద్దు కావడం దురదృష్టకరమన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం రాష్ట్రపతి ప్రణబ్ చర్యలు తీసుకోవాలని తివారీ కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement