
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ఉచిత దర్శనానికి 15 గంటల సమయం, కాలినడక భక్తులకు 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఉచిత, రూ.50ల గదులు ఖాళీగా ఉన్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
గదుల వివరాలు :
ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు- ఖాళీ లేవు
రూ.500 గదులు- ఖాళీ లేవు
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు
సహస్రదీపాలంకరణ సేవ: 100 ఖాళీగా ఉన్నాయి, వసంతోత్సవం : ఖాళీ లేవు, బుధవారం ప్రత్యేక సేవ: సహస్ర కలశాభిషేకం.