చైనా చెరలో ఐదుగురు భారతీయులు | Sakshi
Sakshi News home page

చైనా చెరలో ఐదుగురు భారతీయులు

Published Sun, Dec 15 2013 7:46 PM

Chinese troops apprehend Indians in Chumar, first incident on LAC

చైనా మరోసారి బరితెగించింది. ఈసారి ఏకంగా ఐదుగురు భారతీయులను నిర్బంధంలోకి తీసుకుంది. లడఖ్ ప్రాంతంలోని చుమర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పైపెచ్చు, వాళ్లు భారత భూభాగంలోకి చొరబడి మరీ మనవాళ్లను పట్టుకుపోవడం గమనార్హం. వాస్తవాధీన రేఖ పరిధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. అయితే, ఈ విషయంలో సైన్యం వెంటనే కలగజేసుకోవడంతో ఐదుగురినీ తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు భారతీయ సైనికులకు అప్పగించాయి.

పశువులను మేపుకొంటున్న ఐదుగురు భారతీయులను పీఎల్ఏ దళాలు భారత భూభాగంలోకి కొన్ని కిలోమీటర్లు లోపలకు వచ్చి మరీ తీసుకెళ్లాయి. ఆ ప్రాంతంపై తమ పట్టు ఉందని చూపించుకోడానికే వాళ్లలా చేసి ఉంటారని అంటున్నారు. అయితే ఈ సంఘటనను సామరస్యపూర్వంగా పరిష్కరించుకున్నట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement