
చిన్నారి మృతి, 32 మంది భారతీయులకు గాయాలు!
కల్లోలిత తూర్పు కాంగోలోని గోమా నగరంలో మంగళవారం పేలుడు చోటుచేసుకుంది.
అయితే, స్థానిక మసీదు ఇమామ్ ఇస్మాయిల్ సలుము మీడియాతో మాట్లాడుతూ ఈ పేలుడులో ముగ్గురు శాంతిదూతలు చనిపోయినట్టు తెలిపాడు. ఒక్కసారిగా తమకు పేలుడు చప్పుడు వినిపించిందని, ఆ వెంటనే ఆర్తనాదాలు విన్నంటాయని, దీంతో తాము సంఘటనా స్థలానికి పరిగెత్తుకు వెళ్లామని ఆయన చెప్పారు. 1996-2003మధ్యకాలంలో ప్రాంతీయ ఘర్షణలతో అట్టుడికిన కాంగోలో లక్షలాది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ అనేక సాయుధ మూకలు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసకు చెందిన 1800మంది సిబ్బంది ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు.