ఏసీ 24 డిగ్రీల్లో ఉంటే విద్యుత్‌ ఆదా! | Centre prepares draft note to ensure AC buildings have preset | Sakshi
Sakshi News home page

ఏసీ 24 డిగ్రీల్లో ఉంటే విద్యుత్‌ ఆదా!

Apr 6 2017 3:18 PM | Updated on Sep 5 2017 8:07 AM

ఏసీలను నిర్ణీత ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉపయోగించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది.

న్యూఢిల్లీ: ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ)లను నిర్ణీత ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉపయోగించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది. ‘భవనాలు, వాణిజ్య సముదాయాలు, విమానాశ్రయాల్లో ముందుగా నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్దనే ఏసీలు పనిచేసేలా నిబంధనలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా?’అని ఓ సభ్యుడు ప్రశ్న అడిగారు. దీనికి పర్యావరణ మంత్రి అనిల్‌ మాధవ్‌ దవే రాజ్యసభలో సమాధానమిచ్చారు.

ఏసీలను వేసవిలో 28 డిగ్రీ సెల్సియస్‌ వద్ద ఉంచుకోవాలని జపాన్‌ ప్రభుత్వం 2005లోనే ఆ దేశ ప్రజలను, వ్యాపారస్తులను కోరిందనీ, దీనివల్ల విద్యుత్తు వినియోగం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఏసీలను 20 డిగ్రీ సెల్సియస్‌ లేదా అంతకన్నా తక్కువకు వినియోగిస్తున్నారనీ, దీనిని 24 డిగ్రీలకు పెంచితే విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement