అశ్విని నాచప్ప పర్సు మాయం | Sakshi
Sakshi News home page

అశ్విని నాచప్ప పర్సు మాయం

Published Wed, Dec 4 2013 12:57 AM

అశ్విని నాచప్ప పర్సు మాయం

బెంగళూరు, న్యూస్‌లైన్: పరుగుల రాణి అశ్విని నాచప్ప పర్సును ఓ దుండగుడు మాయం చేశాడు. అందులోని రెండు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.1.70 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై అశ్విని మంగళవారం స్థానిక జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు.. గత శనివారం బెంగళూరులోని ఓ పాఠశాల నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలకు అశ్విని ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంలో ఆమె వేదికపై ఉంచిన పర్సు చోరీకి గురైంది. దానిలోని 2 ఏటీఎం కార్డులను ఉపయోగించిన దుండగుడు రూ. 1.70 లక్షలు డ్రా చేశాడు. అశ్వినికి తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని, పిన్ నంబర్ కూడా తెలిసి ఉండడంతోనే నగదునూ డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
Advertisement