అశ్విని నాచప్ప పర్సు మాయం | Ashwini Nachappa's debit cards stolen, Rs 1.70 lakh withdrawn | Sakshi
Sakshi News home page

అశ్విని నాచప్ప పర్సు మాయం

Dec 4 2013 12:57 AM | Updated on Sep 2 2017 1:13 AM

అశ్విని నాచప్ప పర్సు మాయం

అశ్విని నాచప్ప పర్సు మాయం

పరుగుల రాణి అశ్విని నాచప్ప పర్సును ఓ దుండగుడు మాయం చేశాడు. అందులోని రెండు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.1.70 లక్షలు డ్రా చేసుకున్నాడు.

బెంగళూరు, న్యూస్‌లైన్: పరుగుల రాణి అశ్విని నాచప్ప పర్సును ఓ దుండగుడు మాయం చేశాడు. అందులోని రెండు ఏటీఎం కార్డులను ఉపయోగించి రూ.1.70 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై అశ్విని మంగళవారం స్థానిక జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు.. గత శనివారం బెంగళూరులోని ఓ పాఠశాల నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలకు అశ్విని ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ సందర్భంలో ఆమె వేదికపై ఉంచిన పర్సు చోరీకి గురైంది. దానిలోని 2 ఏటీఎం కార్డులను ఉపయోగించిన దుండగుడు రూ. 1.70 లక్షలు డ్రా చేశాడు. అశ్వినికి తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని, పిన్ నంబర్ కూడా తెలిసి ఉండడంతోనే నగదునూ డ్రా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement