లోయలో పడిన బస్సు: 10 మంది మృతి | 10 Killed, 40 Injured After Bus Falls Into Gorge in Dhar, Madhya Pradesh | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు: 10 మంది మృతి

Feb 17 2015 7:21 AM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు.

జబువా: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 40 మందిపైగా గాయపడ్డారు. ధార్ జిల్లాలోని మచలియా ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ నుంచి రాజస్థాన్ లోని గాలియకోట్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement