కొత్తగూడెంలో మహిళ నేత్రదానం | Woman donates Eyes after death | Sakshi
Sakshi News home page

కొత్తగూడెంలో మహిళ నేత్రదానం

Aug 22 2015 4:57 PM | Updated on Sep 3 2017 7:56 AM

మనం చనిపోయినా మన కళ్లు మరొకరికి చూపునివ్వడానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఓ మహిళ తన కళ్లను దానం చేసింది.

కొత్తగూడెం (ఖమ్మం) : మనం చనిపోయినా మన కళ్లు మరొకరికి చూపునివ్వడానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఓ మహిళ తన కళ్లను దానం చేసింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలోని గొల్లగూడకు చెందిన కటకం లక్ష్మి(48) గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ శనివారం  మృతిచెందింది. కాగా తాను మరణించాక తన కళ్లను దానం చేయాలని ఆమె ముందే కోరడంతో.. ఆమె ముగ్గురు కూతుళ్లు ఖమ్మం నేత్ర నిధికి ఆమె కళ్లను దానం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement