ప్రజలా..? మాస్టర్ మైండా...? | Whose interest is paramount to Govt of AP, says KTR | Sakshi
Sakshi News home page

ప్రజలా..? మాస్టర్ మైండా...?

Jun 24 2015 4:55 PM | Updated on Sep 3 2017 4:18 AM

ప్రజలా..? మాస్టర్ మైండా...?

ప్రజలా..? మాస్టర్ మైండా...?

అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్: అవినీతిపరులను కాపాడేలా ఏ చట్టం ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 'ఓటు కోట్లు' వ్యవహారంపై ట్విటర్ వేదికగా చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాజ్యాంగబద్దంగా రూపొందించిన ఏ చట్టమైనా, సెక్షనైనా ప్రజలను కేంద్రబిందువుగా చేసుకుని ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం 5 కోట్ల ప్రజల ప్రయోజనాలు కాపాడుతుందా లేదా రూ. 5 కోట్లతో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మాస్టర్ మైండ్ ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.

ఏడాది కాలంగా అత్యంత ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో సెక్షన్ 8 పెట్టాలని ఏపీ సర్కారుకు ఇప్పుడు గుర్తుకురావడం శోచనీయమన్నారు. విభజన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సెక్షన్ 8 చెల్లదని అరుణ్ జైట్లీ చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ పై వివాదాలు చేయడం మానుకుని, ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement