‘తమకు 24 గంటల కరెంటు వద్దని.. 9 గంటల కరెంట్ చాలని’ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం గోరింటాల రైతులు తీర్మానించారు.
నిరంతర విద్యుత్తో బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. తమ గ్రామం పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంద న్నారు. తమ గ్రామానికి తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చి జలవనరులను కాపాడాలని రైతులు కోరారు.