వోల్వో బస్సు - లారీ ఢీ


నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో బుధవారం వోల్వో బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


 


మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు లారీని ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top