రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం | Two burnt alive in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం

May 24 2015 7:46 AM | Updated on Aug 30 2018 3:58 PM

నల్లగొండ జిల్లా ఆలేరులో ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు.

ఆలేరు (నల్లగొండ) : నల్లగొండ జిల్లా ఆలేరులో ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తుండగా..ఆలేరు సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన డీసీఎం వారిద్దరితోపాటు బైక్‌ పైనుండి దూసుకెళ్లింది. దీంతో బైక్ నుంచి మంటలు చెలరేగి వారిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. లారీ, డీసీఎం డ్రైవర్లు సంఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement