ఇద్దరు నగల దొంగల అరెస్ట్... | two arrested in jewellery theft | Sakshi
Sakshi News home page

ఇద్దరు నగల దొంగల అరెస్ట్...

Feb 21 2015 5:33 PM | Updated on Aug 25 2018 6:21 PM

సేమియాలో నిద్రగోలీలు కలిపి వృద్ధుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏఎస్సీ యాదయ్య తెలిపారు.

వరంగల్(కరీమాబాద్): సేమియాలో నిద్రగోలీలు కలిపి వృద్ధుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అపహరించిన ఇద్దరు దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏఎస్సీ యాదయ్య తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు శివనగర్‌కు చెందిన దాసరి కొమరయ్య, కళావతిలకు చెందిన ఇంట్లో కిరాయికి ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గంజి పద్మ(30), కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన బత్తుల బాబు(28)లు తమ పెళ్లి రోజని చెప్పి ఇంటి యజమానులైన కొంరయ్య, కళావతిలకు సేమియాలో నిద్రగోలీలు కలిపి అందించారు. వారు మత్తులోకి జారుకోగానే ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు, రెండుతులాల బంగారు గొలుసులు, తులం బంగారు మాటీలు, చెవిదిద్దులు, 20 తులాల వెండి పట్టగొలుసులతో పాటు పాటు టీవీ, డీవిడీ, సెల్ ఫోన్‌లు అపహరించారు.

నిందితులు గంజిపద్మ, బత్తుల బాబు శనివారం సత్తెనపల్లికి వెళ్తుండగా ఖమ్మం ప్రధాన రహదారి గవిచర్ల క్రాస్ రోడ్లో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ యాదయ్య వివరించారు. నిందితుల నుంచి రూ.1.20 లక్షల విలువైన వెండి, బంగారు నగలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు శ్రమపడ్డ  మిల్స్‌కాలనీ సెకండ్ ఎస్సై రవీందర్‌తో పాటు పోలీస్ బృందాన్ని ఏఎస్పీ అభినందించి రివార్డు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement