హైదరాబాద్: రైతాంగ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని, వాటిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జనరల్, ఇంఫాల్ కేంద్రీయ వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ పేర్కొన్నారు. అన్నదాతకు గౌరవం, లాభదాయకత పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2050 వరకు పెరిగే జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు ఆహార ఉత్పత్తి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభా, తరుగుతున్న సహజ వనరుల కారణంగా ఆహార భద్రత చాలా కీలకాంశంగా మారిందని తెలిపారు. దీనికి తగ్గట్లుగా వ్యవసాయంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న బిగ్డేటా ఎనాలసిస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితరాలను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. పట్టణ జనాభా అధికమవుతున్న పరిస్థితుల్లో పంటల సాగు విధానం కూడా మారాలని సూచించారు. వ్యవసాయం మరింత ఆకర్షణీయంగా, లాభదాయకంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
అతి స్వల్ప కాలంలోనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అనేక అంశాల్లో పురోగతి సాధించిన నేపథ్యంలో ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్రావు, సిబ్బందిని అయ్యప్పన్ అభినందించారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో 592 మంది యూజీ విద్యార్థులు, 144 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 9 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులతోపాటు 17 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు ఆదర్శనీయం
Published Sun, Mar 10 2019 3:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement