
సాక్షి, హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్ని స్వరూపానంద ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు నిర్వహిస్తారు.