రెతుబంధు చెక్కును తిరిగి ఇచ్చిన తనికెళ్ల భరణి 

Tanikella Bharani Gave Back  Rythu Bandhu Cheque - Sakshi

షాబాద్‌(చేవెళ్ల) :  సిటీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కను తిరిగి అధికారులకు అందజేశారు. షాబాద్‌ మండలంలోని చిన్నసోలిపేట్‌ గ్రామంలో ఆయనకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి రైతుబంధు పథకం ద్వారా రూ.10 వేల చెక్కు వచ్చింది. ఆ చెక్కును బుధవారం తహసీల్ధార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ పద్మావతి అందజేశారు. ఆ చెక్కను తనికెళ్ల భరణి తిరిగి అధికారులకు అందజేశారు.

ఆ మొత్తాన్ని రాష్ట్ర రైతునిధికి జమచేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్ధిక వెసులుబాటు కలిగిన వారందరు ఉదారంగా సాగుపెట్టుబడి చెక్కులను తిరిగి రాష్ట్ర రైతుసంఘం నిధికి ఇవ్వాలని కోరారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top