సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రేడ్ 2 భాషా పండితులు(ఎల్పీ), పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. తెలుగు భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి చేశారు. తెలంగాణలో ఇకపై గ్రేడ్–2 పండిట్ పోస్టులు ఉండవు. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6,024 మంది భాషా పండితులకు, 793 మంది గ్రేడ్ 2 భాషా పండితులకు మేలు జరుగుతుంది.
ఎమ్మెల్సీల కృతజ్ఞతలు..
తెలుగు పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్రెడ్డి ప్రగతిభవన్లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హామీ నిలబెట్టుకున్న కేసీఆర్..
గ్రేడ్–2 భాషా పండిట్లను గ్రేడ్–1 పండిట్లుగా అప్గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘా లు పేర్కొన్నాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైలుపై సంతకం చేయ డం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని పండిట్లు, పీఈటీలకు మేలు జరుగుతుందని పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీఆర్టీయూ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు.
ఎల్పీ, పీఈటీలకు ఎస్ఏ హోదా
Published Wed, Feb 6 2019 12:19 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
లోక్సభ పోరు నేడే
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
పోటెత్తాలి మన ఓటు!
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
తోడు దొంగలు
Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
వన్స్ మోర్.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్’కే పట్టం
తప్పక చదవండి
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- పోలింగ్ సందర్భంగా హింసకు టీడీపీ కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
Advertisement