ఆరేళ్లయినా వైఎస్‌ను ప్రజలు మరవలేదు | Sakshi
Sakshi News home page

ఆరేళ్లయినా వైఎస్‌ను ప్రజలు మరవలేదు

Published Sat, Aug 29 2015 2:41 AM

ఆరేళ్లయినా వైఎస్‌ను ప్రజలు మరవలేదు - Sakshi

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి
 
తొర్రూరు/పాలకుర్తి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరేళ్లుగాగా భౌతికంగా మనమధ్య లేకున్నా.. ప్రజలు ఆయన చేసిన సేవలు మరువ లేదని వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో వైఎస్సార్ అభిమానులు పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఘనస్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలు డప్పు చప్పుళ్లతో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కాందాడి అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వారికి   ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పల్లెలో వైఎస్ హయాంలో ప్రతి ఇంటిలో లబ్ధి సొందిన వారు ఉన్నారని అన్నారు.

వైఎస్ ఆకస్మిక మరణం తరువాత అధికారంలో ఉన్న వారు ఆ పథకాలను అమలు చేయలేక పోయారని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ బలోపేతం కావడం ఖాయమన్నారు.కార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి , జిల్లా నాయకులు విలియమ్స్, ఇర్మియా, ముగిగా కళ్యాణ్‌రాజ్, అప్పం కిశోర్, మహిపాల్ రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, నీలం లక్ష్మయ్య, బిజ్జాల అశోక్, కర్ర అశోక్ రెడ్డి, కృష్ణమూర్తి, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న, లక్ష్మన్ పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement