'బీమాలో ఎఫ్‌డీఐలతో నష్టం లేదు' | no loss of FDI in insurance | Sakshi
Sakshi News home page

'బీమాలో ఎఫ్‌డీఐలతో నష్టం లేదు'

Mar 5 2015 1:36 AM | Updated on Oct 4 2018 5:15 PM

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆయన బీమా సవరణ బిల్లుపై బుధవారం మాట్లాడారు. ఎఫ్‌డీఐల వల్ల నష్టమేమీ కనిపించడం లేదని, పైగా దాదాపు 3 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 15 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నప్పటికీ రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పంటల బీమా విషయంలో రైతులు భరించలేని ప్రీమియం ఉండడంతో వాళ్లు చెల్లించలేకపోతున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement