హైదరాబాద్‌కు రానున్న ప్రధాని | Narendra Modi Visits Hyderabad To Attend BJYM National Conference | Sakshi
Sakshi News home page

Oct 5 2018 9:14 AM | Updated on Oct 5 2018 9:18 AM

Narendra Modi Visits Hyderabad To Attend BJYM National Conference - Sakshi

నరేంద్ర మోదీ (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల 28న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ యువమోర్చా జాతీయ సమ్మేళనం ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. తెలంగాణ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. బీజేవైఎం నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారని యువమోర్చా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డజనుకు పైగా కేంద్ర మంత్రుల షెడ్యూల్‌ ఖరారైందని తెలిపారు. మూడు రోజులపాటు (అక్టోబర్‌ 26,27,28) కొనసాగే ఈ సమ్మేళనంలో 50 వేల మంది యువమోర్చా కార్యకర్తలు భాగం కానున్నారు. సమ్మేళనం ముగింపు రోజున లక్ష మంది కార్యకర్తలు సభకు హాజరవనున్నారని బీజేవైఎం నాయకులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement