ఎకరానికి రూ. 20వేల నష్ట పరిహారమివ్వండి

MLC Jeevan Reddy Writes Letter To KCR - Sakshi

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అకాల వర్షాలు, అతివృష్టి వల్ల వరి పంట చాలా దెబ్బతిందని, ధాన్యం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదట్లో వాతావరణం అనుకూలించలేదని, ఆ తర్వాత వర్షా లు పుంజుకున్నాయని అన్నారు . కానీ అతి వృష్టి, అకాల వర్షాల కారణంగా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగడంతో ధాన్యం రైతులు నష్టపోయారని లేఖలో వెల్లడించారు. ఈ నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో అంచనాలు ప్రారంభించి కేంద్రం సాయంతో ఇన్‌పుట్‌ సాయం అందించాలన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top