
తండ్రిని కొట్టి.. కూతుర్నెత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బాలిక తన తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లి ఆటోలో వెళుతుండగా మధ్యలో అడ్డుకున్న నలుగురు వ్యక్తులు తండ్రిని బెదిరించి అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు.
అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పాశవిక లైంగిక దాడి జరిపి అనంతరం ఆమె ప్రాణాలు చిదిమేశారు. తండ్రి ఫిర్యాదు చేయడంతో గాలింపులు జరిపిన పోలీసులు శుక్రవారం బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన జరగడానికి ఆటో డ్రైవర్ ప్రమేయం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.