సంగారెడ్డి క్రైం: సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగం మరువలేనిదని, అలాంటి అమరవీరులను అక్టోబర్ 21వ తేదీన ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ డా.శెముషీ బాజ్పాయ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సంద ర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పౌరుల క్షేమం కోసం పోలీసులు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటారన్నారు. పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తారన్నారు. దేశం కోసం, ప్రజలకోసం అమరులైన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులు ఏ రోజైనా వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, పోలీసుల సేవలు మరువలేనివన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అడిషనల్ ఎస్పీ పి.రవీందర్రెడ్డి మాట్లాడుతూ, పోలీసు అమరవీరులు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరంజీవులుగా ఉన్నారన్నారు. అంతకుముందు దేశంలో అమరులైన 653 మంది పోలీసుల పేర్లను చదివిన ఏఎస్పీ రవీందర్రెడ్డి వారికి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఇక జిల్లాలో అమరులైన 21 మంది పోలీసుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పాయ్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్థూపానికి ఎస్పీ శెముషీ, కలెక్టర్ రాహుల్ బొజ్జా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ బాబురావు, జ్యోతిప్రకాష్, సంగారెడ్డి స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ విజయ్కుమార్, ఏఆర్ డీఎస్పీ కిషన్రావు, మహిళా పీఎస్ డీఎస్పీ లాల్ అహ్మద్, పట్టణ సీఐ ఆంజనేయులు, జహంగీర్, మస్తాన్వలీ, దుర్గారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అమరుల త్యాగం చిరస్మరణీయం
Published Wed, Oct 22 2014 1:36 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement