జగదేవ్పూర్: ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలోని పంటలను సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఎవుసం ఎట్లుందని నౌకర్లను అడిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనను కలిసేందుకు వచ్చిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ నాయకులతో ఉప ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించారు.
శనివారం ఫాంహౌస్కు వచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడే బస చేశారు. దీంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్పాయ్, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్రెడ్డి, గజ్వేల్ సీఐ అమృతారెడ్డి, ఎస్ఐ వీరన్న వ్యవసాయ క్షేత్రం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. సీఎం వెళ్లేవరకు వీరంతా ఇక్కడే ఉన్నారు. ఆదివారం సాయంత్రం 6.20 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లారు.
విద్యార్థిని రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకుంటా..
అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని రాజేశ్వరి కుటుం బాన్ని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీ ఎం తిరిగివెళ్తున్న క్రమంలో ఫాంహౌస్ పక్కనే ఉన్న శివారువెంకటాపూర్ గ్రామ ప్రజలు ఆయన కాన్వాయ్ను ఆపి అనారోగ్యంతో మృతి చెందిన రాజేశ్వరి కుటుంబ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఎవుసం ఎట్లుందో సూద్దామని వచ్చానని.. మళ్లొచ్చిన్నాడు తప్పకుండా సాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు.
రెండుమూడు రోజుల్లో నేనే వస్తా...
ములుగు: ఎర్రవల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్కు వెళుతున్న సీఎం కేసీఆర్ మర్కుక్ గ్రామంలో కొద్దిసేపు ఆగారు. సీఎం వెళుతున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సర్పంచ్ నర్సింలు స్థానికులతో కలిసి రోడ్డుపై వేచి ఉన్నారు. ఇది చూసిన సీఎం తన కాన్వాయ్ని ఆపి వారితో మాట్లాడారు. తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మర్కుక్వాసులు వినతిపత్రం అందజేశారు. రెండు మూడు రోజుల్లో తానే స్వయంగా అధికారులతో వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంపీటీసీ గీతారాంరెడ్డి, ఉప సర్పంచ్ నవనీతమాధవరెడ్డి, వార్డు సభ్యుడు మల్లేష్, నాయకులు ఉన్నారు.
ఎవుసం ఎట్లుందో సూద్దామని
Published Mon, Sep 15 2014 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement