సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు  | India Today Good Governance Award For Telangana | Sakshi
Sakshi News home page

సుపరిపాలనలో రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు 

Nov 23 2019 4:07 AM | Updated on Nov 23 2019 4:07 AM

India Today Good Governance Award For Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుపరిపాలనకు గానూ ఇండియా టుడే ఏటా ఇచ్చే స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌ కాన్‌క్లేవ్‌–2019 అవార్డు తెలంగాణకు దక్కింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చేతుల మీదుగా రాష్ట్ర సర్కార్‌ తరఫున టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆర్థిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. సర్కార్‌ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువయ్యేలా సీఎం కేసీఆర్‌ నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement