మెదక్ రూరల్, న్యూస్లైన్: నిన్నటి వరకూ కొనుగోలు కేంద్రాలు లేక సతమతమైన రైతన్నలకు ఇపుడు కొత్త చిక్కొచ్చిపడింది. ధాన్యం రైతుల ఇళ్లకు చేరి దళారుల పాలవుతున్నా పట్టించుకోని అధికారులు ఉన్నట్టుండి ఊరికి రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యుత్సాహం చూపారు. దీంతో కొనుగోళ్లు జరిపేందుకు రెండు కేంద్రాల వారు సిద్ధం కావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు రైతులు ఏ కేంద్రంలో ధాన్యం విక్రయించాలో తెలియక అయోమయంలో పడిపోయారు.
ఊరికి రెండు కేంద్రాలు
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని భావించిన ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు కేటాయించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. దీంతో అటు మహిళలకు పని కల్పించడంతో పాటు అన్నదాతకు మద్దతు ధర కల్పిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం నుంచీ ఐకేపీతో పాటు ప్రాదేశిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు సైతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో పలు గ్రామాల్లో ఇటు ఐకేపీ, పీఏసీఎస్ సంఘాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
ఈక్రమంలోనే ధాన్యం కొనుగోలుకు పోటీ పెరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలోనే మండల పరిధిలోని సర్దన, భూర్గుపల్లి గ్రామాల్లో ఈసారి కూడా రెండేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ధాన్యం కొనుగోలుకు పోటీ పెరగడంతో మహిళా సంఘాల సభ్యులు, పీఏసీఎస్ సిబ్బందికి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం మహిళా సంఘాల సభ్యులు ధాన్యం కొనుగోలు చేసే ప్రాంతంలోనే పీఏసీఎస్ సిబ్బంది కూడా కొనుగోళ్లు చేపట్టారు.
ఇందుకు మహిళా సంఘాల సభ్యులు అభ్యంతరం తెలపడంతో పీఏసీఎస్ సిబ్బంది గొడవకు దిగారు. రైతు తమకు విక్రయిస్తానంటేనే కొనుగోళ్లు చేపడుతున్నామని పీఏసీఎస్ సిబ్బంది చెబుతుండగా, తాము కొనుగోళ్లు జరిపే ప్రాంతానికి వచ్చి మరీ కొనుగోళ్లు జరపడమేమిటని మహిళా సంఘాల సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒకే గ్రామంలో రెండేసి కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడం వల్లే గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై మండల ఏపీఎం సరితను వివరణ కోరే ందుకు ‘న్యూస్లైన్’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
‘పోటాపోటీ’తో పోట్లాట
Published Wed, May 14 2014 11:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement