ఇప్పటికీ విత్తని విత్తు
- అదనుదాటుతున్నా.. కరుణచూపని వరుణుడు
- ఆందోళనలో అన్నదాతలు
- ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ దృష్టి!
సంగారెడ్డి డివిజన్: అదను దాటుతున్నా వరుణుడి జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై సుమారు 25 రోజులవుతున్నా వర్షాలు కురవకపోవటంతో రైతులు ఇప్పటికీ విత్తనాలను విత్తుకోలేదు. గత ఏడాది ఈపాటికే.. జిల్లాలో 45 వేల హెక్టార్ల వరకు పంటలను సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్లో 4.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాల్సి ఉండగా వర్షాభావం కారణంగా ఇప్పటికీ సాగు మొదలుపెట్టలేదు.
మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మాసానికి అతితక్కువ వర్షపాతం నమోదైన జిల్లాగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికితోడు ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే నెలలో వర్షాలు కురిసి పంటల సాగుకు రైతులు సిద్ధమైనా పంటల దిగబడిపై ప్రభావం ఉంటుందని వ్యవసాయశాఖ రంగ నిపుణులు చెబుతున్నారు. వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గురువారం వరకు జిల్లాలో 79.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 33.8 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.గత ఏడాది జూలై 19వ తేదీ నాటికి 95.5 మిలీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 20.1 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వరుణుడి జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు పడకపోతే పెసర, జొన్నపై ప్రభావం
వర్షాభావం కారణంగా రైతులు పంటల సాగు ఇంకా ప్రారంభంలేదు. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం బోరుబావుల కింద 270 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు వేశారు. అలాగే 3,134 హెక్టార్లలో వరి నారుమళ్లు వేసుకున్నారు. వర్షాలు కురవకపోవటంతో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటల విత్తనాలను ఇంకా విత్తుకోలేదు.
ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా నెలాఖరులోగా పెసర, మినుము, జొన్న విత్తనాలు విత్తుకోవాలి. లేనిపక్షంలో అదను దాటే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే నెలలో విత్తనాలు విత్తుకున్నా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లాలో 15 వేల హెక్టార్లలో జొన్న, 38 వేల హెక్టార్లలో పెసర, 18 వేల హెక్టార్లలో మినుము పంటలు సాగు కావాల్సి ఉంది.
వర్షాభావం వల్ల ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు వచ్చే నెల 15వ తేదీలోగా విత్తుకునేందుకు అవకాశం ఉంది. అప్పటికీ వర్షాలు కురవనిపక్షంలో ఆయా పంటలసాగుపైనా ప్రభావం పడనుంది.
ఆందోళన చెందవద్దు: జేడీఏ
జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి భుక్యా తెలిపారు. నెలాఖరులోగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఖరీఫ్లోరైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వచ్చేనెల కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును సూచిస్తామని తెలిపారు.
చినుకు పడేనా.. చింత తీరేనా?
Published Fri, Jun 20 2014 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement