ధర్మపురిలో మంత్రుల మకాం | dharmapuri | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో మంత్రుల మకాం

Jul 18 2015 1:56 AM | Updated on Aug 15 2018 9:27 PM

శని, ఆదివారాల్లో సెలవుల దృష్ట్యా ధర్మపురికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది.

శని, ఆదివారాల్లో సెలవుల దృష్ట్యా ధర్మపురికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. దీంతో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ధర్మపురిలో పుష్కరాల పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావులను నియమించారు.
 
 ఈ మేరకు వీరిద్దరు శని, ఆదివారాల్లో ధర్మపురిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పుష్కరాలపై సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement