డీసీఎం ఢీకొట‍్టడంతో కారు దగ‍్ధం

dcm dash...car burn - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం ఆటోనగర్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- డీసీఎం ఢీకొట్టిన సంఘటనలో డీసీఎం డీజిల్‌ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు దగ‍్ధమైంది. కారులో ఉన్నవారికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top