► క్రెడిట్, డెబిట్ కార్డుల్నిక్లోనింగ్ చేసిన ముఠా
► స్వైపింగ్ మెషీన్ల ద్వారా రూ.కోటి స్వాహా
► నలుగురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు తీసుకు ని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోట్ల స్వాహా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.
కరెంట్ ఖాతాల ద్వారా..
నగరానికి చెందిన మామిడి మహేశ్ జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్లో 4 కరెంట్ ఖాతాలు తెరిచి.. వ్యాపార లావాదేవీలకు ఫిబ్రవరిలో నాలుగు స్వైపింగ్ మెషీన్లు తీసుకున్నాడు. ఓ కేసులో నిందితునిగా ఉన్న మహేశ్కు ఇటీవలే కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో జైలుకు వెళ్తూ తన స్వైపింగ్ మెషీన్లను స్నేహితుడైన కిరణ్కుమార్కు అప్పగించాడు. వనస్థలిపురం లో చిన్న దుకాణం నడుపుతున్న కిరణ్కు కొన్నాళ్ల క్రితం చాంద్పాషాతో పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు పిన్ నంబర్, డేటా వస్తుందని అతను కిరణ్తో చెప్పాడు. స్వైపింగ్ మెషీన్లు తనకిస్తే లావాదేవీలపై 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు.
కమీషన్ కోసం పక్కదారి..
కమీషన్ కోసం కిరణ్ స్వైపింగ్ మెషీన్లను పాషాకు అప్పగించాడు. పాషా వాటిని కేరళకు చెందిన అబుబాకర్కు అందించాడు. కేరళలోని యూసుఫ్ నుంచి క్లోన్డ్ కార్డుల్ని తీసుకుంటున్న ఇతను వాటిని స్వైపింగ్ మెషీన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేశ్ కరెంట్ ఖాతాల్లో పడేలా చేస్తున్నాడు. కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్గా తీసుకుని మిగిలినది అబుబాకర్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్గా తీసుకుని మిగిలింది యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. ఈ వ్యవహారాల్లో కిరణ్కు రామ్ప్రసాద్.. అబుబాకర్కు కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకరించారు.
రెండు నెలల్లో రూ.కోటి స్వైప్
ఈ గ్యాంగ్ రెండు నెలల్లో అనేక మంది క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోట్లు స్వాహా చేసింది. జేఅండ్కే బ్యాంక్ జారీ చేసిన స్వైపింగ్ మెషీన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలి యకుండానే వారి కార్డుల్ని క్లోన్ చేసి, నగదు కాజేస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. దీంతో జేఅండ్కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీ సులు కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్కుమార్ను అరెస్టు చేశారు. జైల్లో ఉన్న మహేశ్ను పీటీ వారెంట్పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్తో పాటు చాంద్పాషా కోసం గాలిస్తున్నారు.
‘క్లోన్’ చేసి రూ.కోటి కొట్టేశారు!
Published Sat, Jul 8 2017 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement