రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం | couple died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

Jun 29 2014 12:51 AM | Updated on Jul 10 2019 7:55 PM

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

పట్టణంలోని ఐఎంఐ ఫంక్షన్‌హాల్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. సంఘటనకు సంబంధించిన వి వరాలు

 జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నలుగురిని బలిగొన్నాయి. సూర్యాపేట వద్ద గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాలవగా భువనగిరిలో సోదరి అంత్యక్రియలకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. బీబీనగర్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మరణించాడు.
 
 భానుపురి : పట్టణంలోని ఐఎంఐ ఫంక్షన్‌హాల్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. సంఘటనకు సంబంధించిన వి వరాలు..  గుంటూరు జిల్లా చుండూరుకు చెం దిన గుడిసె  శేషయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని చి కిత్స నిమిత్తం సొంత కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. కారులో శేషయ్యతో పాటు అతని భార్య ధనమ్మ, కుమారుడు అనిల్ ఉ న్నారు. అనిల్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.  మార్గమధ్యంలో సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమం లో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శేషయ్య(48) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ధనమ్మ(46), అనిల్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ ధనమ్మ మృతి చెందింది.  విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాని కెళ్లి పరిశీలించారు. శేషయ్య మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement