CoronaVirus: Quarantine Period Extended 28 Days in Telangana State: TS Govt - Sakshi Telugu
Sakshi News home page

కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్‌

Apr 22 2020 4:42 PM | Updated on Apr 22 2020 6:23 PM

Coronavirus 28 Days Home Quarantine In Telangana - Sakshi

సెకండరీ కాంటాక్ట్‌ను టెస్ట్ చేయొద్దని.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచితే  సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 రోజులు కావడంతో ఇప్పటివరకు రెండు వారాల హోం క్వారంటైన్‌ విధిస్తున్నారు. అయితే, కొన్ని కేసుల్లో 14 రోజుల అనంతరం పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
(చదవండి: కరోనాపై పోరులో మరో చీకటి కోణం)

దాంతోపాటు వైరస్‌ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న వ్యక్తికి మాత్రమే పరీక్షలు‌ చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. సెకండరీ కాంటాక్ట్‌ను టెస్ట్ చేయొద్దని.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచితే  సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెకండరీ కాంటాక్ట్‌కు స్టాంప్ వేసి.. 28 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉంచాలని సర్కార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒడిశా, కేరళ, అస్సాం, జార్ఖండ్‌ రాష్ట్రాలు కూడా హోం క్వారైంటన్‌ కాలాన్ని 28 రోజులకు పెంచాయి.
(చదవండి: పెట్రోలు పంపులు నిండిపోయాయి: నిల్వ ఎలా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement