ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి | Congress legislature party lodge a complaint against 5 mlcs | Sakshi
Sakshi News home page

ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి

Jun 28 2014 2:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి - Sakshi

ఆ అయిదుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయండి

టీఆర్ఎస్లో చేరిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని డీ శ్రీనివాస్ శనివారం శాసనసభ కార్యదర్శి సదారాంకి ఫిర్యాదు చేశారు.


హైదరాబాద్ : టీఆర్ఎస్లో చేరిన అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలిలో విపక్ష నేత డీ శ్రీనివాస్ శనివారం శాసనసభ కార్యదర్శి సదారాంకి ఫిర్యాదు చేశారు.  పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు.  కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన అయిదుగురు ఎమ్మెల్సీలపై ఫిర్యాదు చేశామన్నారు. ఫిరాయింపును రుజువు చేసే సాక్ష్యాలను ఫిర్యాదు లేఖలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. వాటిని ఛైర్మన్ పరిశీలించి తక్షణమే ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని ఆశిస్తున్నట్లు డీఎస్ తెలిపారు. చైర్మన్ స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement