బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు | Congress complaint to ec on Bathukamma Sarees Distribution | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Sep 29 2018 3:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress complaint to ec on Bathukamma Sarees Distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కాంగ్రెస్‌ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయనుందని ఈ కార్యక్రమంలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పాల్గొననున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు కాకుండా అధికారులే చేపట్టేలా ఈసీ పర్యవేక్షించాలని ఫిర్యాదులో కోరారు. చీరల పంపిణీ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement