ప్రహసనంగా మారిన దరఖాస్తుల ప్రక్రియ
15వ తేదీలోగా అర్జీలు పరిశీలించాలంటున్న ప్రభుత్వం
ఇంకా 44 శాతం మిగిలి ఉన్న దరఖాస్తులు
భూ వివరాల సేకరణలో అధికారులు బిజీ
సంక్షేమ పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆహారభద్రత పథకంపై అయోమయం నెలకొంది. ఆహారభద్రత కింద జనవరి నుంచే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు భావిస్తున్నప్పటికీ.. జిల్లాలో మాత్రం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రహసనంగా మారింది. లక్షల్లో దరఖాస్తులు రావడం.. వాటి పరిశీలనకు సిబ్బంది కొరత తలెత్తడం.. మరోవైపు రెవెన్యూ వ్యవహారాల భారం పెరగడంతో ఆహారభద్రత దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 13,67,372 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 7,66,724 దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. ఇందులో 6,33,171 అర్హులుగా గుర్తించారు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జనవరి నుంచే ఆహారభద్రత పథకం అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అనంతరం లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఆహార భద్రత కార్డులు, ఓటర్ల జాబితా సవరణ, దళితులకు భూ పంపిణీ, పౌరసరఫరాల గోదాముల నిర్మాణం తదితర అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల, వికారాబాద్ డివిజన్లలో దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మల్కాజిగిరి, సరూర్నగర్, రాజేంద్రనగర్లో వెనకబడిందన్నారు. ఆయా డివిజన్లలో పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న డివిజన్లలో అదనంగా సిబ్బందిని నియమించి గడువులోగా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణకుగాను దరఖాస్తుల స్వీకరణకు వచ్చే రెండు ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. ఆయా కేంద్రాల్లో బీఎల్ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 500 పోలింగ్ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, బీఎల్ఓల నియామకం పూర్తిచేయాలన్నారు.
దళితులకు భూ పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి భూ పంపిణీ చేయడం జరిగిందని, సంబంధిత లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడంతోపాటు వాటిని వ్యవసాయ భూములుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన వ్యవసాయ, ఉద్యానవన, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్ శాఖల అధికారుల సమన్వయ కమిటీలను సమావేశపర్చి ఎస్సీలకు పంపిణీ చేసిన భూముల్లో పంటలసాగుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనవరి నుంచే ‘ఆహార భద్రత’
Published Fri, Dec 5 2014 11:33 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement