జానారెడ్డితో విభేదించిన భట్టి విక్రమార్క | Clash in Telangana Congress Leaders reaction over kcr comments | Sakshi
Sakshi News home page

జానారెడ్డితో విభేదించిన భట్టి విక్రమార్క

Jun 19 2015 2:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి వ్యాఖ్యలతో విభేదించారు.

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి వ్యాఖ్యలతో  విభేదించారు. తన భాష హుందాతనం గురించి జానా ఏం మాట్లాడారో తెలియదని భట్టి విక్రమార్క అన్నారు.

 

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏ సన్నాసితో (పూర్తి కథనం) మాట్లాడారో తెలియదని చెప్పానని, ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై మాట్లాడటం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.  కాగా భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలని జానారెడ్డి సూచించిన విషయం తెలిసిందే. కేసీఆర్ పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలు ఆ పదాన్ని వాడటం సరికాదని జానా అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement