'ఆ పదాన్ని' వాడటం సరికాదు | Sakshi
Sakshi News home page

'ఆ పదాన్ని' వాడటం సరికాదు

Published Fri, Jun 19 2015 12:22 PM

'ఆ పదాన్ని' వాడటం సరికాదు

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క హుందాగా వ్యవహరించాలంటూ తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలతో జానారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసి అని అంటే పరుష పదజాలం వాడితే తప్పుపడుతున్న మన పార్టీ నేతలు... అలాంటి పదాన్ని మనం వాడటం సరికాదని హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీ వారంతా హుందాగా వ్యవహారించాలని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు. సెక్షన్ - 8 ఎప్పుడు ఎలా అమలు చేయాలనేదానిపై స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా కేంద్రం, గవర్నర్ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరికి వారు అభిప్రాయాలు చెబుతూ గందరగోళ పరచడం సరికాదని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నత్తనడకన సాగుతుందో లేదో ప్రభుత్వమే పరిశీలించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్, కేసులు నడుస్తున్నాయి... ఆ ఆంశంపై పదేపదే మాట్లాడలేనని జానారెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా జానారెడ్డి....శుక్రవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.  

Advertisement
Advertisement