-
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత● పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్
రామగిరి(మంథని): స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని, వాటి భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లు, ఈవీఎంల తరలింపు ప్రక్రి యను పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రావీశ్గుప్తాతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చామని కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తిచేశామని ఆయన వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం యంత్రాల తరలింపు పారదర్శకంగా చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారులు అరుణశ్రీ, హనుమా నాయక్, దివాకర, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలు తరలించిన స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈవీఎంలు తరలించిన మంథని జేఎన్టీయూలోని స్ట్రాంగ్రూమ్లను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు కమిషనర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత చేపట్టామని ఆయన అన్నారు. స్థానిక పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు నిత్యం పహరా కాస్తున్నాయని వివరించారు. సీసీ కెమరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు సాయుధ రక్షణలో స్త్రాంగ్రూమ్లు ఉంటున్నాయని చెప్పారు. ఏసీపీ పర్యవేక్షణలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలతోపాటు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేశ్, సీఐలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పత్రాల పరిశీలన పోలింగ్ పత్రాలను పరిశీలించామని ఆర్వో ముజమ్మిల్ఖాన్ అన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల ఎన్నికల పత్రాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. -
బీఆర్ఎస్ విజయం ఖాయం
● ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖని: పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము గెలిచిన తర్వాత హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మాఫీ కోసం కృషి చేస్తామని, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అమలయ్యేలా పోరాటం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తద్వారా అనతికాలంలోనే ప్రజల చీత్కారానికి గురైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అహంకార ధోరణి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేలా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు మిర్యాల రాజిరెడ్డి, పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, గోపు ఐలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించండి
● ‘కేశోరాం’ కార్మికుల డిమాండ్ ● ఫ్యాక్టరీ ఎదుట ధర్నాపాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మంగళవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి యాజమాన్యం తీరుపై నిరసన తెలిపారు. కంపెనీలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది కావస్తోందన్నారు. ఇప్పటికీ యూనియన్ నాయకులు రాజీనామా చేయకుండా కాలయాపనతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. తద్వారా తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కేశోరాం పర్మినెంట్ యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ కార్మికుల ఆందోళనకు మద్దతును ప్రకటించారు. స్పందించిన హెచ్ఆర్ మేనేజర్ గోవిందరావు.. నాయకులు, కార్మికులతో చర్చించారు. జూన్ 10వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈకార్యక్రమంలో ప్రతినిధులు నగునూరి రమేశ్, బొడ్డు రాములు, వెంకటేశ్, సతీశ్, గట్టయ్య, ప్రసాద్, కట్కూరి సురేశ్, ఇటిక్యాల శ్రీకాంత్, పోతుల ప్రసాద్, ఖదీర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
ఓటెత్తిన మహిళలు
రామగుండం: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులోనూ పట్టణాల కన్నా గ్రామాల్లోనే వీరిఓటు శాతం అధికంగా నమోదైంది. రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలో అత్యధిక సంఖ్యలో మహిళా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు వెనుకంజలో నిలిచారు. కలెక్టర్ ప్రకటించిన ఓటింగ్ జాబితాను పరిశీలిస్తే అంతర్గాం మండల పరిధిలోని అత్యధిక పోలింగ్ బూతులలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. -
‘రామగుండం’లో 80.78 శాతం పోలింగ్
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి పార్ల మెంట్ పరిధిలోని రామగుండం అసెంబ్లీ ని యోజకవర్గంలో సోమవారం అత్యధిక పోలింగ్ నమోదైంది. ఆకెనపల్లి(08)లో 874 మంది ఓటర్లు ఉండగా 706 మంది ఓటు హక్కు వినియోగించుకోగా రికార్డుస్థాయిలో 80.78 శాతం పోలింగ్ నమోదు చేశారని అధికారులు వెల్లడించారు. ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్లోని దీప్తి మహిళా సమితి పోలింగ్ కేంద్రం(నంబరు – 56)లో అత్యల్పంగా 30.09 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ 638మందికి 192 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తలుపెద్దపల్లిరూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో 7.0జీపీఏ కన్నా అధికంగా గ్రేడ్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి కార్పొరేట్ కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నాగలైశ్వర్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఆశ్రమ, ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకులాలు, కేంద్రీయ విద్యాలయాల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చర్యలుగోదావరిఖని: రానున్న వర్షాకాలంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గననుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ ఆదేశించారు. సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3 క్వారీని ఆయన మంగళవారం సందర్శించారు. ఓబీ, కోల్ క్వారీల్లో నీరు నిలవకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఓబీ వెలికితీతలో వేగం పెంచాలని సూచించారు. డైరెక్టర్ వెంట ఆర్జీ–2 జీఎం సూర్యనారాయణ, మేనేజర్ రమేశ్, అధికారి నర్సింగరావు ఉన్నారు. డిజిటలైజేషన్ త్వరగా పూర్తిచేయండి సింగరేణి ఉద్యోగుల సమాచార డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ సూచించారు. ఏరియాలోని ఉద్యోగుల వివరాలను త్వరగా కంప్యూటరీకరణ చేయాలన్నారు. ఈమేరకు ఉద్యోగుల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. నైపుణ్యాభివృద్ధిలో యువతకు ఉచిత శిక్షణ జ్యోతినగర్(రామగుండం): నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధిలో ఎన్టీపీసీ ఉచితంగా శిక్షణ ఇస్తోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సీపెట్ శిక్షణ కేంద్రంలో ఆర్నెల్లపాటు అందించే ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీపీసీ ప్రభావిత, పునరావాస గ్రామాలకు చెందిన యువతకు సీపెట్ ద్వారా మెషిన్ ఆపరేటర్–ప్లాస్టిక్ ప్రాసెసింగ్ కోర్సు అందిస్తోందని అన్నారు. ఉచిత శిక్షణతోపాటు వసతి, భోజన సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని ఆయన తెలిపారు. 40 మంది కోర్సులో శిక్షణ పొంద నున్నట్లు ఆయన వివరించారు. శిక్షణ అనంతరం ప్లాస్టిక్, పాలిమర్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం విద్యర్థులకు శిక్షణ కిట్లు అందించారు. కార్యక్రమంలో ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్తో పాటు సీపెట్ అధికారులు, సీఎస్సార్ ప్రతినిధి వేముగంటి యుగంధర్రావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
No Headline
పోలింగ్ కేంద్రం పురుషులు మహిళలు 2 – పొట్యాల 207 218 3 – పొట్యాల 223 224 5 – మద్ధిర్యాల 299 309 8 – ఆకెనపల్లి 351 355 9 – బ్రాహ్మణపల్లి 330 332 11 – ముర్మూర్ 327 328 14 – ఎల్లంపల్లి 309 336 17 – అంతర్గాం 206 236 22 – పెద్దంపేట 201 237 -
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలోని టాన్స్జెండర్లు సోమవారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. స్థానిక మనోచైతన్యలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పలువురు ట్రాన్స్జెండర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చి.. ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఖాజీపల్లి గ్రామాని కి చెందిన ఐఎఫ్ఎస్ అధి కారి బయ్యపు సందీప్ కు మార్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఢిల్లీ నుంచి విమానంలో వచా్చారు. సమీప పోలింగ్ కేంద్రంలో సోమవారం తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు కోసం అమెరికా నుంచి..రామగిరి(మంథని): ప న్నూర్ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు చిందం సమ్మయ్య చిన్నకూతు రు చిందం కావ్య అమెరికాలోని పెన్సుల్వేనియా గ ణన్ యూనివర్సిటీలో చ దుకుంటోంది. ఎన్నికల్లో తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామం వచ్చి సోమ వారం ఓటుహక్కు వినియోగించుకుంది. అప్పుడు 41రోజులు.. ఇప్పుడు 22 రోజులు సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో పోలింగ్ పక్రియ ఒక ఎత్తయితే.. ఆ తర్వాత ఫలితాలు వెంటనే వెలువడే అవకాశం లేకపోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో సుదీర్ఘకాలం పాటు నిరీక్షించాల్సి రావడం మరో ఎత్తవుతోంది. ఎన్నికల పక్రియ ముగియగానే ఫలితాల కోసం అభ్యర్థులతోపాటు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా చూస్తారు. విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తెలిసే ఆ రోజు రాజకీయ పార్టీలకు, నాయకులకు అగ్నిపరీక్షగా నిలుస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన తర్వాత 16 రోజులకు ఫలితాలు వెల్లడికాగా, 2019లో పోలింగ్ తర్వాత 41రోజులకు ప్రకటించారు. ఈసారి 22 రోజుల తర్వాత.. జూన్ 4వ తేదీ వరకు ఫలితాల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఎదురు కావడం గమన్హారం. -
తొలిసారి ఓటేసిన యువత
పెద్దపల్లిరూరల్/గోదావరిఖనిటౌన్/సుల్తానాబాద్(పెద్దపల్లి)/రామగిరి(మంథని): జిల్లాలోని యువ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సుమా రు 12వేల మందికి పైగా కొత్తగా ఓటర్లు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో చాలామంది సోమవారం ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటువేయడం ఆనందంగా, సంతోషంగా ఉందని వెల్లడించారు. అయితే, అవి నీతి రహిత పాలన అందించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, కొత్త ప్రాజెక్టులు తేవడంలో చొరవ చూపే నాయకుడికే తమ ఓటు వేశామని వెల్లడించారు. ఇంకా ఎవరేమంటున్నారంటే.. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
గోదావరిఖని/మంథని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఓటర్లు స్వే చ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రం తనిఖీ పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రాలను సీపీ శ్రీనివాస్ సందర్శించారు. పోలింగ్ సరళిపై స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు తదితరులు ఉన్నారు. -
సంతోషంగా ఉంది
తొలిఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. పేదల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడికే ఓటు వేశాం. ఓటును అమ్ముకుంటే మంచి నాయకుడిని కోల్పోతాం. అందుకే నిజాయితీగా ఓటు వేయాలి. – ఇసంపల్లి అభినయ్, సెంటనరీకాలనీ సమగ్రత కోసం నేను తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉంది. దేశ సమగ్రతను కాపాడే వారికి నా మద్దతు ఉంటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. – కోడూరి రాజ్ కుమార్, సుల్తానాబాద్ -
పోలింగ్ శాతం(రెండు గంటలకోసారి)
కరీంనగర్: నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 కరీంనగర్ 367353 10.23 20.78 37.95 47.45 60.35 చొప్పదండి 233546 10.9 29.09 48.4 61.58 75.71 వేములవాడ 226188 12.1 30.17 50.11 62.45 74.43 సిరిసిల్ల 246547 7.23 27.8 46.19 55.67 74.83 మానకొండూర్ 225386 10.06 24.96 49.1 62.55 77.73 హుజూరాబాద్ 250429 9.45 22.89 39.66 60.15 73.01 హుస్నాబాద్ 247701 11.84 30.35 48.83 63.98 76.93 నోట్: కరీంనగర్ నియోజకవర్గంలో సగటు పోలింగ్ 72.33 శాతం నమోదైంది.పెద్దపల్లి : నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 6.00 చెన్నూరు 19,3778 9.49 26.35 45.45 58.65 68.00 68.13 బెల్లంపల్లి 17,6514 12.12 30.52 50.42 63.00 70.53 70.53 మంచిర్యాల 27,8738 10.49 24.87 41.40 52.97 59.78 59.78 ధర్మపురి 23,0786 8.70 28.11 47.15 60.23 69.83 73.34 రామగుండం 21,9723 7.64 21.46 38.78 47.10 55.18 61.59 మంథని 23,9699 10.17 27.41 48.21 56.2 61.55 69.90 పెద్దపల్లి 25,7192 9.24 25.57 44.40 55.6 64.80 71.34 మొత్తం 15,96,430 9.69 26.33 45.12 56.25 63.86 68.80నిజామాబాద్ : నియోజకవర్గం ఓటర్లు 9.00 11.00 1.00 3.00 5.00 కోరుట్ల 245249 10.75 29.1 47.77 60.44 70.07 జగిత్యాల 236675 10.42 30.1 45.94 58.93 68.55 నోట్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సాయంత్రం 5.00 గంట వరకు సగటు పోలింగ్ 67.96 శాతం నమోదైంది. -
రండి.. ఓటేద్దాం
● ఓటర్లలో చైతన్యం తెచ్చిన అధికారులు సాక్షి, పెద్దపల్లి: ‘నేడే ఓట్ల పండుగ.. ఊరూవాడా అంతటా ఒకటే ఉత్సాహం.. దేశపౌరులుగా ఒక్కసారి వచ్చి ఓటేసి వెళ్లిపోండి’ పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధమంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో 12,914 మంది ఓటర్లు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో ఓట ఎలా వేయాలి, పోలింగ్ కేంద్రంలో ఎంతమంది అధికారులు ఉంటారు, ఏజెంట్లు ఏంచేస్తారు? తదితర వివరాలతో కథనం.. ఏజెంట్ల పాత్ర ● బరిలో నిలిచిన ప్రతీఅభ్యర్థి ఒక ఏజెంట్ను పోలింగ్ కేంద్రంలో నియమించుకునే అవకాశం ఉంది. నేరచరిత్ర ఉన్నవారిని ఏజెంట్లుగా స్వీకరించరు. ఓటువేయడం కోసం వచ్చిన వ్యక్తి(ఓటరు) అతడేనా? కాదా? సరిచూడాల్సిన బాధ్యత పోలింగ్ ఏజెంట్దే. సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారా? అనేది కూడా వీరే పర్యవేక్షించాలి. ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. పోలింగ్ కేంద్రంలో.. ● వరుసలో మీవంతు వచ్చినప్పుడు ఓటరు స్లిప్పు, ఫొటో గుర్తింపు కార్డు చేత పెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. అక్కడ ముగ్గురు అధికారులు మూడు టేబుళ్ల వద్ద ఉంటారు. మరోవైపు వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. ● పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించగానే ఓటరు మీరా? కాదా? అని అధికారి నిర్ధారించుకుని పురుష ఓటర్లు అయితే ఓటరు జాబితాలో మీ పేరు, సీరియల్ నంబర్ వద్ద అడ్డగీత పెడతారు. మహిళల పేర్లయితే అడ్డగీతతోపాటు రౌండ్ చేస్తారు. ● రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడు వే లుకు సిరా గుర్తువేస్తారు. 17ఏ రిజిష్టర్లో ఓట రు సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. ● అక్కడ ఉంటే మూడో పోలింగ్ అధికారి మీ వ్దద ఉన్న ఓటరు చిట్టీ తీసుకుని మీ వేలుపై సిరా చుక్క పరీక్షిస్తాడు. ఓటరుకు తెలుపు రంగుతో కూడిన ఎంపీ ఓట్ల స్లిప్లు ఇస్తారు. ● ఓటు వేయడానికి రహస్య కంపార్టుమెంట్లోకి వెళ్లాలి. కంపార్టుమెంట్ వద్ద ఓటరు మినహా మిగతా ఎవరూ ఉండరు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఈవీఎంలో ఓటు వినియోగం ఇలా.. ● మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ యూనిట్ సిద్ధం చేస్తారు. ● మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా బ్యాలెట్ యూనిట్పై (ఈవీఎం) నీలిరంగు బటన్ నొక్కాలి ● మీరు బటన్ నొక్కిన తర్వాత ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తుకు ఎదురుగా ఎరుపు రంగు లైటు వెలుగుతుంది. ● ఓటు ఎవరికి వేశామో చూసుకోడానికి అక్కడే వీవీ ప్యాట్ ఏర్పాటు చేస్తారు. ఈ వివరాలు వీవీ ప్యాట్ తెరపై ఏడు సెకన్లు మాత్రమే కనిపిస్తాయి. తెరపై ఆ వివరాలను సరిచూసుకోవాలి. మీకు ఆ వివరాలు ప్రింట్ తీసి ఇవ్వరు. -
మహిళా ఓటర్లు ఎటువైపు?
● పెద్దపల్లి పార్లమెంట్లో మహిళా ఓటర్లే అధికం ● అభ్యర్థుల తలరాత మార్చేది వారే.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 15,96,430 మంది ఓటర్లుండగా అందులో 7,87,705 మంది పురుషులు కాగా, 8,08,622 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషు ల కన్నా మహిళా ఓటర్లు 20,917మంది అధికంగా ఉన్నారు. పెద్దపల్లి సింగరేణి కార్మికులు, మహిళా ఓటర్లు ఎవరిని కరుణిస్తే.. వారే విజయం సాధి స్తారని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి రోజు వరకూ తమవంతు ప్రయత్నాలు సాగించారు. అధికార కాంగ్రెస్.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, ఇంకా అనేక పథకాలను మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తమని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అన్ని ప్రధాన పార్టీ లు మహిళా స్వశక్తి సంఘాల సభ్యులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి తమకు మద్దతునిస్తే మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాయి. ఈ ఎన్నికల్లో మహిళల కటాక్షం ఎవరి దక్కుతుందో వేచిచూడాలి మరి..! మహిళా ఓటర్ల వివరాలు నియోజకవర్గం ఓటర్లసంఖ్య పెద్దపల్లి 1,30,466 మంథని 1,22,329 రామగుండం 1,09,870 చెన్నూరు 97,752 బెల్లంపల్లి 89,219 మంచిర్యాల 1,40,648 ధర్మపురి 1,18,338 మొత్తం 8,08,622 -
పెద్దపల్లిలో పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఆదివారం పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి సామగ్రి అందజేశారు. ఏపీవోలు, ఓపీవోలు తమకు అందాల్సిన సామగ్రి సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో వెళ్లారు. పెద్దపల్లి డి స్ట్రిబ్యూషన్ కేంద్రం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో గంగయ్య, డీఈవో మాధవి, సీడీపీవో కవిత పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్.. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి తీసుకెళ్లే బస్సులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జీపీఎస్ ట్రాకింగ్ అనుసంధానించారు. బస్సులు ఏ మార్గంలో, ఎటు, ఎక్కడ వరకు వెళ్తున్నాయనే అంశాలను కంట్రోల్రూం నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిచేందుకు దీనిద్వారా అవకాశముంటుంది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఓటరు స్లిప్పులో ముద్రించిన బార్కోడ్తో పోలింగ్ కేంద్రం లొకేషన్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. -
సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
● సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా మంథని: రామగిరి మండలం సెంటనరీకాలనీ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మంథని నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో ఎన్నికల సిబ్బంది తరలివెళ్లారు. నియోజకవర్గంలో 2,39,699 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1,17,352 మంది పురుషులు, 1,22,329 మంది మహిళలు, 18మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవోలు 319 మంది, ఏపీవలో 319 మంది, ఓపీవోలు 638మందిని నియమించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా.. జిల్లాలోనే తూర్పు డివిజన్కు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా పేరుంది. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మావోయిస్టులు చొరబడే అవకాశం ఉండడంతో పోలీసులు అటవీ గ్రామాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలు లేకున్నా పొరుగు రాష్ట్రాల్లో ఉనికి చాటుతున్న నేఫథ్యలో ఎన్నికలకు అవాంతరాలు ఎదురుకాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 54 గ్రామాలను క్రిటికల్గా, 23 నక్సల్స్ ప్రభావిత గ్రామాలుగా గుర్చించారు. ఇందులో సుమారు 400 మంది పోలీసులను నియమించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు రామగిరి(మంథని): పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. జేఎన్టీయూలోని మంథని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతపై పలు సూచనలు చేశారు. సోమవారం జరిగే పోలింగ్కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భగవద్రామానుజుల జయంతి
కరీంనగర్ కల్చరల్: భగవద్రామానుజాచార్యుల జయంతి సందర్భంగా నగరంలోని జ్యోతినగర్లో ఆదివారం శ్రీవైష్ణవ వైదిక సేవాసమితి, వికాస తరంగిణి, జెట్ ఆధ్వర్యంలో ఆండల్గోష్టి నిర్వహించారు. వేదభవనం ప్రిన్సిపాల్ కె.వరప్రసాదాచార్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి పారాయణాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవైష్ణవ వైదిక సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణమాచార్యులు, గోవర్దనగిరి శశికిరణ్, యాదగిరి, వానమామలై శ్రీనివాసాచార్యులు, అనంతాచార్యులు, వికాసతరంగిణి జిల్లా అధ్యక్షుడు గౌతమ్రావు, కార్యకర్తలు, బాధ్యులు పాల్గొన్నారు. మహిళా వాకర్స్కు సన్మానం కరీంనగర్: మదర్స్డే సందర్భంగా సప్తగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడప కొటేశ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వాకర్స్ మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా కోటేశ్కుమార్ మాట్లాడుతూ అమ్మ లేనిదే జన్మ లేదు.. అమ్మ త్యాగాన్ని తలవని రోజు లేదు.. ప్రతీపనిలో అమ్మ బాధ్యత చాలా గొప్పగా పోషిస్తుందన్నారు. వాకర్స్ రమేశ్, శరత్, నాగరాజమ్, మక్బూల్ హుస్సేన్, శ్రీనివాస్, శ్రీధర్, సత్యం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గీత కార్మికుడికి గాయాలు రామడుగు: గుండి గ్రామానికి చెందిన కత్లి మల్లేశం అనే గీత కార్మికుడు ఆదివారం సాయంత్రం ఈత చెట్టుపై నుంచి పడడంతో గాయాలపాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. చెట్టుపై అదుపు తప్పడంతో కింద పడి తలకు గాయాలైనట్లు గీత కార్మికులు చెప్పారు. -
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
● పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు ● ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): రామగుండం నియోజకవర్గంలోని పోలింగ్ సిబ్బంది ఆదివారం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్టీపీసీ టీటీఎస్ జెడ్పీ హైస్కూల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సిబ్బందికి ఎన్నికల సామగ్రి కేటాయించారు. దీంతో వారు బస్సుల్లో తరలివెళ్లారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. నియోజకవర్గంలో 2,19,723మంది ఓటర్లున్నారు. 260 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,040మంది సిబ్బందిని నియమించారు. 26రూట్లలో వాహనాల ద్వారా సిబ్బందిని పోలీసు బందోబస్తు మధ్య తరలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామిల్ఖాన్ సందర్శించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఉన్నారు. ఏర్పాట్లు పూర్తిచేశాం సోమవారం జరిగే ఎన్నికలకు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాం. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద కూలర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాం. దివ్యాంగుల కోసం వీల్చైర్లు అందుబాటులో ఉంచాం. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం. జ్యోతినగర్లో.. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లోని డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో రామగుండం నియోజవర్గంలోని ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 260 పోలింగ్ కేంద్రాలకు 26 రూట్లలో 52 బస్సుల్లో సిబ్బందిని తరలించారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఏసీపీ రమేశ్ పర్యవేక్షించారు. పంపిణీ కేంద్రంలో ఉక్కపోత అధికంగా ఉండడంతో కూలర్లు ఏర్పాటు చేసి, డిప్యూటీ డీ అండ్ ఎం హెచ్వో కృపాబాయి ఆధ్వర్యంలో వైద్యశిబిరం ప్రారంభించారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని తరలించే 52 బస్సులకు ఈసారి జీపీఎస్ ఏర్పాటు చేశామని ఎంవీఐ భీమ్సింగ్ తెలిపారు. రామగుండం సమాచారం మొత్తం ఓటర్లు 2,19,723 పురుషులు 1,09,826 మహిళలు 1,09,870 ధర్డ్జెండర్లు 27 పోలింగ్ కేంద్రాలు 260 పోలింగ్ లోకేషన్లు 116 సమస్యాత్మక కేంద్రం 1 పోలింగ్ సిబ్బంది 1,040 రూట్లు 26 -
ఎన్నికల్లో ఎన్సీసీ సేవలు
● రామగుండం సీపీ శ్రీనివాస్ గోదావరిఖని: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీసీ సేవలు వినియోగిస్తున్నామని సీపీ శ్రీనివాస్ తెలిపారు. తన కార్యాలయంలో ఆదివారం ఆయన ఎన్సీసీ కేడెట్లతో మాట్లాడారు. సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సీసీ కేడెట్ల సేవలను ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 90మంది కేడెట్లను ఎంపిక చేశామని తెలిపారు. అయితే, వీరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని, ఓటర్లను క్యూ పద్ధతిన ఉండేలా చూడాలని, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సహాయంగా ఉండాలన్నారు. అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి వస్తే సాయం అందించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, సీసీ ఆర్బీ సీఐ స్వామి, ఆర్ఐ మధు పాల్గొన్నారు. కించపరిచే పోస్టులు చేస్తే కఠిన చర్యలు గోదావరిఖని: సోషల్మీడియాలో కించపర్చే పో స్టులు చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓటర్లను తప్పుదోవ పట్టించేలా పాత వీడియోలు, అభ్యర్థులను కించపర్చేలా పోస్టులు, పరువు నష్టం కలిగించేలా వీడియోలను పోస్టుచేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా వెనకాడబోమన్నారు. -
వేలుకు సిరాచుక్క
● ఎన్నికల్లో పారదర్శకత, బోగస్ ఓట్లను అరికట్టేందుకు సిరా చుక్కను వేలిపై పెడుతున్నారు. ఇది ఒక్కసారి పెడితే 72 గంటల వరకు చెరిగిపోదు. ఓటును వినియోగించుకున్నట్లు గుర్తుగా 2006 ఫిబ్రవరి 1నుంచి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు గీతలా సిరాచుక్క వేస్తున్నారు. అంతకుమందు గోరు కింద చర్మంపై పెట్టేవారు. వేలు లేకపోతే.. ● ఓటు వేసినట్లు ఓటరును గుర్తించడానికి ప్రతీపౌరుడికి పోలింగ్ కేంద్రంలో ఎడమచేయి చూపుడు వేలుకు సిరాచుక్క గుర్తుగా పెడుతారు. కొన్ని సందర్భాల్లో ఎవరికై నా ఎడమచేతి చూపుడు వేలు లేకపోతే వారి మధ్య వేలుకు లేదా బోటనవేలుకు సిరాచుక్క పెడతారు. ఒకవేళ మొత్తంగా ఎడమచేతి లేకపోతే కుడిచేతి చూపుడు వేలుకు పెడతారు. రెండు చేతులకు వేళ్లులేని పక్షంలో చేతి పైభాగంలో సిరాచుక్క గుర్తు పెడతారు. చాలెంజ్ ఓటు ● చాలెంజ్ ఓటు అనేది ఓటు వేయడానికి కాదు.. అక్రమ ఓట్లను అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు, పోలింగ్ కేంద్రంలోని ఏజెంట్లు అతడు నకిలీ ఓటరు అని గుర్తిస్తే ఆ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకుపోతారు. దానికి ఏజెంట్ తగిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు పీవో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఓటరు జాబితాలో పేరు, వయసు తదితర వివరాలు సరిచూస్తాడు. అవిసరిగా ఉంటే ఓటుహక్కు కల్పిస్తారు. లేకపోతే ఎన్నికల ఏజెంట్ చెప్పినది అబద్ధమని స్పష్టమైతే ఓటు వేయకుండా అడ్డుకుని, చట్టంప్రకారం చర్యలు తీసుకుంటారు. టెండర్ ఓటు ● ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లాక మనఓటు వేరే వ్యక్తులు వేసినట్లయితే.. అప్పుడు మనం టెండర్ ఓటు వేయవచ్చు. ముందుగా ఈ విషయాన్ని పీవోకు ఫిర్యాదు చేయాలి. అప్పుడు పీవో ఏజెంట్ల సమక్షంలో పరిశీలించి, నిజమైతే ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తారు. ఆ ఓటును ఈవీఎంలో కాకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేయాల్సి ఉంటుంది. దాన్ని పీవో నమోదు చేసుకుంటారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓటును లెక్కిస్తారు. సెల్ఫీలు నిషేధం ● పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకునే సమయంలో మొబైల్ ద్వారా సెల్ఫీలు తీసుకోవడం లేదా ఇతరులకు చూపించడం నిషేధం. ఒకవేళ అలా చేస్తే 49ఏం(ఓటు రహస్యం) నిబంధన మేరకు ఆ ఓటరును బయటకు పంపిస్తారు. ఆ ఓటును నిబంధన 17ఎలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. కరెక్ట్ వేశామో లేదో చూడవచ్చు ● ఎన్నికల సంఘం ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేసేందుకు, మనం వేసిన ఓటు ఏ అభ్యర్థికి వేశామో తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా 2014సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ అడిట్ ట్రయల్)ను ప్రవేశపెట్టింది. దీంతో ఓటు వేశాక ఏడు సెకన్ల పాటు మనం ఓటు వేసిన అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తుఉన్న పేపర్ను మనకు తెరపై చూపెడుతుంది. తర్వాత దానంతట అదే వీవీప్యాట్ బ్యాక్స్లో పడిపోతుంది. తెరపై కనిపించే గుర్తు సరిపోనిపక్షంలో పీవోకు ఫిర్యాదు చేయవచ్చు. వీటిలో ఏదైనా ఒకటి ఉండాలి.. ● ఓటు వేయాలంటే ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఓటరు స్లిప్ కేవలం వివరాల కోసం మాత్రమే. భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు 13రకాల గుర్తింపు కార్డులను చూపి మన ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ● ఓటరు గుర్తింపు (ఎపిక్)కార్డు ● ఆధార్ కార్డు ● ఉపాధిహామీ పథకం జాజ్కార్డు ● ఫొటోతో కూడిన బ్కాంకు, పోస్టాఫీసు పాసుబుక్ ● కార్మికశాఖ ఇచ్చిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు ● డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు ● ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డు ● పాస్పోర్టు ● ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంటు ● ఉద్యోగులకు ప్రభుత్వం జారీచేసిన పీఎస్యూలు, ● ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫొటోకూడిన గుర్తింపుకార్డు ● ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డులు – సాక్షి, పెద్దపల్లి -
ఎమ్మెల్యేలకు పరీక్ష!
● అంతుచిక్కని ఓటరు నాడీ పెద్దపల్లిరూరల్: లోక్సభ ఎన్నికల్లో ఓటరు కటాక్షం ఎవరికి దక్కుతుందో అంతుచిక్కక పోవడంతో ప్ర ధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజే పీ, బిఆర్ఎస్ అభ్యర్థులు సహా 42మంది పోటీపడు తున్నారు. నియోజకవర్గంలో కార్మికులు, మహిళా ఓటర్ల కరుణ ఎవరిపై ఉంటే వారికే సానుకూల ఫలితం వచ్చే అవకాశముంటుందనే అంచనా వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షే..! మండుతున్న ఎండల్లో ప్రచారం చేసినా ఎన్నికల ఫ లితం ఎలా ఉంటుందోననే టెన్షన్ సిట్టింగ్ ఎమెల్యే ల్లో నెలకొంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిఽధిలోని ఏ డు అసెంబ్లీలు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతి లోనే ఉన్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మారుడు వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నా రు. సిట్టింగ్ ఎమ్మెల్యేల అండతో అవలీలగా గెలుపొందుతామనే ధీమాను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నా.. మోదీ చరిష్మా ఏమైనా ముంచుతుందా? అని లోలోన మదనపడుతున్నారని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వ చ్చిందని, అదే తమకు విజయం అందిస్తుందని బీ ఆర్ఎస్ నేతలు అంటున్నారు. తమ అధినేత కేసీఆ ర్ అనేక పథకాలు అందించారని, సాగునీరు, కరెంట్కు ఇబ్బందుల్లేకుండా చూశారని చెప్పుకొస్తు న్నా రు. ఇక ప్రధాని మోదీ చరిష్మాతో తాము గెలుపొందడం ఖాయమని కమలనాథులు అంటున్నారు. సోమవారం ఓటరు నొక్కే మీట ఎవరికి అదృష్టం తెచ్చి పెడుతుందో, ఎమ్మెల్యేలు ఈ పరీక్షలో గెలుస్తారో, ఓడిపోతారో జూన్ 4న తేలనుంది. -
గీతకార్మికుడికి గాయాలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దరాతుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ తాటికల్లు గీస్తుండగా ప్రమాదవాశాత్తు తాటిచెట్టుపై నుంచి కిందడపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్గౌడ్ను వరంగల్ ఎంజీఎం తరలించారు. అతడి ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం దగ్ధం ముత్తారం(మంథని): మచ్చుపేటలో బక్కతట్ల రాములుకు చెందిన ఆరు ఎకరాల్లోని వరి గడ్డి ప్రమాదవాశాత్తు నిప్పంటుకుని ఆదివారం దగ్ధమైంది. గ్రామానికి సమీపంలో గడ్డి మంటల్లో కాలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదావరిఖని నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు అదుపులోకి తెచ్చింది. దీంతో ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాలిపోయిన గడ్డి విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని వారు తెలిపారు. తాటిచెట్టుపై పిడుగు మంథని: సిరిపురం గ్రామంలోని దీకొండ పోచమల్లు అనే వ్యక్తి ఇంట్లో గల తాటిచెట్టుపై ఆదివారం పడింది. దీంతో మంటలు లేచాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో చెట్టు కాలిపోయింది. 4 జిల్లాలు.. 42 మండలాలు పెద్దపల్లిరూరల్: నాలుగు జిల్లాలు, 42మండలాల్లో విస్తరించిన పెద్దపల్లి పార్లమెంట్.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గోదావరినదికి ఇరువైపులా ఉంది. మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,87,705మంది పురుషులు, 8,08,622మంది మహిళా ఓటర్లున్నారు. మరో 103మంది థర్డ్జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 1,850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పెద్దపల్లి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, ధర్మపురి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 బ్యాలెట్ యూనిట్లు.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి లోక్సభ స్థానానికి అత్యధికంగా 42మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)లో 16 గుర్తులే ఉంటాయి. దీంతో ప్రతీపోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి 63మంది బరిలో నిలిచారు. ఉపసంహరణ తర్వాత 42మంది పోటీలో మిగిలారు. పోలింగ్ కేంద్రాల్లో 3,848మంది పీవో, ఏపీవో, ఏపీవోలను నియమించారు. అందరూ ఓటేయండి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి లోక్సభకు సో మవారం ని ర్వహించే ఎన్నికల్లో ప్రతీఓటరు తమ ఓ టుహక్కు వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ కోరారు. ఈమేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుహక్కు విలువపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశామని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్కు ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే, 2014 ఎన్నికల్లోనే అత్యధికంగా 66.44శాతం పోలింగ్ నమోదైందని ఆయన వివరించారు. 1962 నుంచి నమోదైన పోలింగ్ శాతం ఏడాది శాతం 1962 55.42 1967 61.33 1971 55.27 1980 56.92 1984 64.01 1989 61.95 1991 55.88 1996 57.94 1998 61.97 1999 59.99 2004 58.07 2009 58.21 2014 66.44 2019 65.45 -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ రామగిరి(పెద్దపల్లి): లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన మంథని అసెంబ్లీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. రిజర్వ్ ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతీపోలింగ్ కేంద్రం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. సహాయ రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సోమవారం తన ఓటుహక్కు వినియోగించుకోనున్నా రు. పట్టణ శివారులోని రంగంపల్లి పో లింగ్ కేంద్రంలో ఆయన తన ఓటుహ క్కు వినియోగించుకోనున్నారు. ఈమే రకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మపాత్ర నిత్య నూతనం జ్యోతినగర్(రామగుండం): అమ్మ పాత్ర నిత్య నూతనమని ఎన్టీపీసీలోని దీప్తి మహిళా సమితి ఉపాధ్యక్షురాలు జ్యోత్స్న త్రిపాఠి అన్నారు. ఎన్టీపీసీ రా మగుండం పర్మినెంట్ టౌన్షిప్లోని బాలికా సాధికారత మిషన్–2024 శిక్ష ణ కేంద్రంలో ఆదివారం మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా త్రిపాఠి మాట్లాడారు. అమ్మ ఒక్కరే అయినా, ఆమె పోషించే పాత్రలు అనేకమని పేర్కొన్నారు. గృహిణిగా, తల్లి గా, సోదరిగా, భార్యగా.. ఇలా ఎన్నో పాత్రల్లో తనకు తెలియకుండానే ఒదిగిపోయి కుటుంబ ఎదుగుదలకు ఊపిరిలూదుతోందని పేర్కొన్నారు. ఆమెను సమాజం గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం బాలికలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యులు పద్మశ్రీతోపాటు జెమ్ శిక్షణ పొందుతున్న బాలికలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
పెద్దపల్లిరూరల్: సోమవారం నిర్వహించే పా ర్లమెంట్ ఎన్నికల కోసం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 72 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఇందులో ఒక్కో నియోజకవర్గానికి ఐదేసి చొప్పున మహిళలకు ప్రత్యేకంగా 35 పోలింగ్ కేంద్రాలను సుందరీకరించారు. అలాగే యువత, దివ్యాంగులకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 14 పోలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేశారు. ఇక మోడల్ పోలింగ్ స్టేషన్లుగా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురిలో ఐదేసి చొప్పున 20, రామగుండం, మంథని,పెద్దపల్లిలో ఒక్కొక్కటి చొప్పున 3 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రూ.2.14కోట్లు జప్తు పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లో చేపట్టిన వాహన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.2,14,04,742 నగదును జప్తు చేశామని, అందులో ఆధారాలు చూపిన వారికి గ్రీవెన్స్ క మిటీ రూ.2,08,13,242 నగదు విడుదల చే సిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్తెలిపారు. ఆధారాలు చూపని రూ. 5,91,500 నగదు సీజ్ చేశామని పేర్కొన్నారు. ‘ఎల్లంపల్లి’లో 5 టీఎంసీలు రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. నీటిపారుదలశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. అయితే, ఆదివారం నీటిమట్టం 140.89 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 5.90 టీఎంసీలకు పడిపోయింది. -
నేడే లోక్సభ పోలింగ్
ఆదివరాహస్వామికి పూజలు కమాన్పూర్ : స్థానిక శ్రీఆదివరాహస్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చా రు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు.● మూడు ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం ● ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ● పెద్దపల్లి జిల్లా మంథనిలో సాయంత్రం 4 గంటలకే ముగింపు ● కరీంనగర్లో 28, పెద్దపల్లిలో 42 మంది, నిజామాబాద్లో 29మంది పోటీ ● భారీ పోలీసు బందోబస్తుతో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ ● పోలింగ్ కేంద్రాలకు తరలిన ఈవీఎంలు, సిబ్బంది ● డబ్బులు అందక తీవ్ర నిరాశలో పలువురు ● రాత్రి వరకు వేచి చూసినా రాని నాయకులుసోమవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2024సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో నేడు(సోమవారం) జరిగే పోలింగ్కు అన్నిఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. గతనెల 18న నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ మూడుస్థానాల్లో ఎక్కడా రెబల్స్ లేకపోవడం గమనార్హం. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (బీజేపీ), వెలిచాల రాజేందర్ రావు (కాంగ్రెస్), మాజీ ఎంపీ వినోద్కుమార్ (బీఆర్ఎస్)లతో కలిపి 28 మంది, పెద్దపల్లిలో గడ్డం వంశీ (కాంగ్రెస్), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ)లతో కలిపి 42 మంది, ఇక నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ (బీజేపీ), ఎమ్మెల్సీ జీవన్రెడ్డి (కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్)లతో సహా 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 2,194 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయా కేంద్రాలకు ఆదివారం సాయంత్రం పోలింగ్ అధికారులు, సిబ్బంది ఈవీఎంలను తీసుకెళ్లారు. పోలీసు భద్రత మధ్య ఈవీఎంలు పోలింగ్స్టేషన్లకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికలకు పోలీసు యంత్రాంగం 2,500మందితో భద్రత కల్పిస్తోంది. పార్లమెంట్ పరిధిలో 17లక్షల 97 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్లో వీల్చైర్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, నీడ వసతి కూలర్లు, ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. మొత్తం 10,200మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మొత్తం బ్యాలెట్ యూనిట్స్ 5,500, కంట్రోల్ యూనిట్స్ 2,743, వీవీ ప్యాట్స్ 3,077 ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఐదు మోడల్ పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,012 పోలింగ్ స్టేషన్లల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు దాటిన వారందరూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 15.96లక్షల ఓటర్లు, 1,462మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ముజమ్మిల్ఖాన్ వెల్లడించారు. 139 లోకేషన్లలో 221 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను, 38 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 497 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, 131 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతీ ఒక్కఓటరు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.స్వీప్ స్టాండ్ వద్ద ఆర్వో ముజమ్మిల్ఖాన్న్యూస్రీల్ఆశ.. నిరాశ శనివారం ప్రచారం ముగియగానే.. ప్రలోభాలు మొదలైనా అవి ఆశించినస్థాయిలో లేవని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే డబ్బు, మందు పంపిణీ ప్రభావం చాలా తక్కువగానే జరిగిందని తెలిసింది. సాయంత్రం మూడు సెగ్మెంట్ల పరిధిలో కొన్ని మాత్రం చోట్ల డబ్బుల పంపిణీ జరిగింది. సిరిసిల్ల జిల్లాలో పంచమని ఇచ్చిన క్వార్టర్ బాటిళ్లలో మండల నా యకులు చేతివాటం ప్రదర్శించారు. జగిత్యాలలో పలుచోట్ల చికెన్, క్వార్టర్ బాటిళ్లు, ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ జరిగింది. ఇక పెద్దపల్లిలో డ బ్బుల పంపిణీ అంతగా జరగలేదు. కా ర్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం క్వార్టర్లు పంచారని సమాచా రం. ఇక కరీంనగర్ జిల్లాలో కులసంఘాలకు కొన్నిచోట్ల మందు పార్టీలు జరిగాయి. జిల్లాలో చాలాచోట్ల నాయకులు తమకు తాయిలాలు ఇస్తారని రాత్రి ఒంటి గంట వరకు ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. చాలా మంది ఇంటి ఎదుట లైట్లు ఆర్పేస్తే.. నే తలు అటు నుంచి అటే వెళ్లిపోతారన్న ఆందోళనతో రాత్రి ఒంటి గంట వరకు వాకిట్లో లైట్లు వేసే ఉంచారు. అయినా నేతలు రాకపోవడం కొసమెరుపు. జిల్లా మొత్తం ఓటర్లు అభ్యర్థులు కరీంనగర్ 17.90 లక్షలు 28పెద్దపల్లి 15.96 లక్షలు 42నిజామాబాద్ 17.04 లక్షలు 29
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement