-
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.బాలరాజు మంగళవారం తెలిపారు. 7జీపీఏ, ఆ పైగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. జూన్ 3న సీజీజీ ఆన్లైన్ ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారని, జూన్ 6న ఎస్సీ కార్యాలయ అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారన్నారు. అర్హులు కుల, ఆదాయం, పదో తరగతి పాస్ మార్కుల మెమో, ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంకు పాస్బుక్, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్స్ (నాలుగు నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి) హాస్టల్ బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు పాస్ఫొటోలు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
దోమల వ్యాప్తిని అరికట్టాలి
డోర్నకల్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి ఆదేశించారు. మండలంలోని చాప్లాతండా శివారు దారావత్తండాను మంగళవారం వైద్య సిబ్బందితో కలిసి ఆమె సందర్శించారు. ఇటీవల తండాలో ఐదు డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. వ్యాధిబారిన పడిన వారి ఇళ్లతో పాటు పరిసరాల్లోని 62 ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల పరిసరాలు, నీటి తొట్టెలు పరిశీలించి స్థానికులతో మాట్లాడిన డీఎంహెచ్ఓ డెంగీ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మధ్యాహ్నం దోమలు కుట్టడం ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుందని, ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళ, శుక్రవారాల్లో డ్రై డే, ఫ్రైడేలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నాగేశ్వర్రావు, డాక్టర్ శ్రవణ్, ఇన్చార్జ్ డీపీహెచ్ఎన్ఓ మంగమ్మ, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి గూడూరు: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష అన్నారు. మండలంలోని అయోధ్యపురం, తీగలవేణి పీహెచ్సీలతో పాటు గాజులగట్టులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో సిబ్బంది విధుల నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు, మందుల నిల్వలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయానికి హాజరై విధులు నిర్వర్తించాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాంబాబు, యమున, దేవేందర్, పుష్పలత, సబ్ యూనిట్ ఆఫీసర్ వి.శ్రీనివాస్, సీహెచ్ఓ కృష్ణార్జున్, కోమల, సిబ్బంది షానుబేగం, ఫార్మసిస్టు అమల, సిబ్బంది పాల్గొన్నారు. నిరుపయోగంగా ఎస్సీ దుకాణ సముదాయం మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదురుగా షెడ్యూల్ కులాల (ఎస్సీ)కు సంబంధించిన దుకాణ సముదాయం నిరుపయోగంగా మారింది. ఇక్కడ సుమారు 10 షెటర్లు ఉన్నాయి. మరమ్మతులు చేయించి అర్హులైన దళిత కుటుంబాలకు కేటాయిస్తే అభివృద్ధి చెందుతాయి. కాగాఅధికారులు చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి కేటాయించాలని పలువురు కోరుతున్నారు. తాటి ముంజలకు భలే గిరాకీ.. జిల్లా కేంద్రంలోని అండర్బ్రిడ్జి, రామాలయం గుడి ఎదురుగా తాటి ముంజలను విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. కాగా వీటిలో విటమిన్స్, ఖనిజ లవణాలు మెండుగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వైద్యులు తెలుపుతున్నారు. అలాగే శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు.. హానికర వ్యర్థాలను తొలగిస్తాయి. దీంతో ప్రజలు ఒక్కో దానికి రూ.5చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. – మహబూబాబాద్ అర్బన్ -
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
తొర్రూరు రూరల్: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని నాంచారిమడూరు శివారు రెడ్డి గార్డెన్లో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మాతృమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం అందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో మొదటి హామీగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిట అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తుందని గుర్తు చేశారు. మహిళా రక్షణకు ప్రభుత్వం టీ–సేఫ్ యాప్ను ప్రారంభించిందని, ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న మహిళలు ప్రయాణంలో ఆపదకు గురైతే తక్షణమే పోలీసులు అక్కడకు చేరుకుని వారిని రక్షిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త రాజరామ్మోహన్రెడ్డి, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్, నాయకులు గుండాల నర్సయ్య, జాటోతు నెహ్రూ, సుంచు సంతోష్, గోపాల్రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, పెదగాని సోమయ్య, బాపురెడ్డి, సోమ రాజశేఖర్, సోమిరెడ్డి, ఉష తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
కేయూ హాస్టళ్ల డైరెక్టర్గా సమ్మయ్య
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్యను మంగళవారం రాత్రి నియమించారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు నియామక ఉత్తర్వు కాపీ ని వీసీ రమేశ్.. సమ్మయ్యకు అందజేశారు. సమ్మయ్య గతంలో కేయూ అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్గా, ఫార్మసీ క ళాశాల ప్రిన్సిపాల్గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్రావు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. పద్మాక్షి మహిళా హాస్టల్ వ ద్ద విద్యార్థినులు మెస్ ఓపెన్ చేయాలని ఆందోళన చేయడం, వాగ్వాదానికి దిగడంతో మనస్తాపానికి గురైన ఆయన.. తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్రావు స్థానంలో సమ్మయ్యను నియమించారు. ఉత్తర్వులు జారీచేసిన రిజిస్ట్రార్ మల్లారెడ్డి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
జనగామ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని విజయ డెయిరీ బైపాస్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల కేంద్ర ఏరియాకు చెందిన మునుకుంట్ల రవి (37) సోమవారం రాత్రి తన పని ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో హనుమాన్ గుడి వద్ద వెనక నుంచి యశ్వంతాపూర్ నుంచి జనగామకు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో రవికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే రవిని ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సృజన్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏటూరునాగారంలో మరో యువకుడు.. ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఏటూరునాగారంలో జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన గుగ్గిల్ల రమేశ్(38) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై ఉన్న హైవే ట్రీట్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. అయితే రమేశ్ను గుర్తుతెలియని వాహనం ఢీకొందా..? లేదా పార్కింగ్ చేసి ఉన్న లారీని ఢీకొని మృతి చెందడా అనే విషయం తెలియాల్సి ఉంది. -
కట్టడికి కట్టుదిట్టం
నెహ్రూసెంటర్: జిల్లాలో సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నివారణకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. జన్యుపరంగా కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించడంతో పాటు ఒకరికి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. ఈమేరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో మొదటి విడత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పటివరకు 70వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరు వ్యాధిగ్రస్తులను గుర్తించారు. అలాగే 190 మంది క్యారియర్లను గుర్తించారు. కాగా వీరు మరొక సికిల్సెల్ క్యారియర్ను పెళ్లి చేసుకోవడం ద్వారా వారికి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సక్రమించనుంది. ఇలాంటి వారు పెళ్లిళ్లు చేసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. వైద్య సిబ్బందికి శిక్షణ.. సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి గుర్తింపులో భాగంగా స్క్రీనింగ్ పరీక్షల కోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. వ్యాధిపై అవగాహన, పరీక్షలు, చికిత్సలపై శిక్షణ అందించారు. 0నుంచి 40 సంవత్సరాల వరకు.. సికిల్సెల్ వ్యాధి గుర్తింపు కోసం 0నుంచి 40ఏళ్ల లోపు వారందరికీ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో మొదటి విడతలో స్క్రీనింగ్ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాధి పరీక్షల కోసం తమ ఆధార్కార్డును అప్డేట్ చేసుకుని మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని, అభా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా) కార్డును పొందాలని సూచిస్తున్నారు. వ్యాధి పరీక్షల అనంతరం వైద్య చికిత్స కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని తెలుపుతున్నారు. వ్యాధి లక్షణాలు.. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో ముఖ్యంగా కాళ్లు, చేతులు నొప్పితో కూడిన వాపు, రక్తహీనత, కీళ్లకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఎముకల్లో కొన్ని గంటల పాటు దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది. ఇది జన్యు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధి కాగా కుటుంబంలో ఒకరి నుంచి మరొకరికి సంభవిస్తుంది. ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. సికిల్సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని కొంత మేరకు నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. వ్యాధికి కచ్చితమైన చికిత్స లేకపోయినా మూలకణాల మార్పిడి, బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అంటే కణాల మార్పిడితో వ్యాధిని కొంత వరకు నయం చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గిరిజనులపై తీవ్ర ప్రభావం.. సికిల్సెల్ ఎనిమియా వ్యాఽధి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభలే అవకాశాలు ఉన్నాయి. గిరిజన సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాధి బారిన పడే ప్రమాదముందని, అక్కడ ఉంటున్న ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొదటి విడత స్క్రీనింగ్లో భాగంగా గార్ల, బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మందికి వ్యాధి పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని పీహెచ్సీలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు అందుబాటులో ఉంటారని, ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు గిరిజనేతర ప్రాంతాల్లో కూడా పరీక్షలను నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలి ప్రతి ఒక్కరు సికిల్సెల్ వ్యాఽధి నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షలను చేయించుకోవాలి. వ్యాధి ముందస్తుగా నిర్ధారణ జరిగితే తద్వారా మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. 0నుంచి 40 సంవత్సరాల లోపు వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అనుమానితులు ఎవరున్నా సమీపంలోని పీహెచ్సీలలో పరీక్షలు చేయించుకోవచ్చు. వైద్య చికిత్సల కోసం వైద్యాధికారులను సంప్రదించాలి. – ఏ.నాగేశ్వర్రావు, ప్రోగ్రాం ఆఫీసర్ సికిల్సెల్ ఎనిమియా నివారణకు వ్యూహం ఫస్ట్ విడతలో 70వేల మందికి స్క్రీనింగ్ 190 మంది క్యారియర్స్, ఇద్దరు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఏజెన్సీ ప్రాంతాలపై వైద్యాధికారుల ప్రత్యేక దృష్టి -
పోలింగ్ రోజు కాంగ్రెస్ ప్రచారం
హన్మకొండ: ఓడిపోతామనే భయంతో పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని బీజేపీ వరంగల్ ఎంపీ అఽభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారంతో పాటు, తనను ఓటర్లు నిలదీస్తున్నట్లు ఒక చానల్ పేరుతో చేసిన ఫేక్ న్యూస్పై ఎన్నికల కమిషన్కు బీజేపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేస్తుందన్నారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, తన గెలుపుకు కృషి చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. అనంతరం బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మృతికి నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ పార్లమెంట్ ప్రభారి డా.వి.మురళీధర్ గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కొలను సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ -
విద్యుదాఘాతానికి వృద్ధురాలి బలి
తొర్రూరు రూరల్: విద్యుదాఘాతానికి ఓ వృద్ధురాలు బలి అయింది. ఈ ఘటన మండలంలోని కంఠాయపాలెంలో చోటు చేసుకుంది. ఎస్సై పిల్లల రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లికొండ నాగమణి, ఇద్దమ్మ.. సోమవారం రాత్రి ఇంట్లో ఇనుప దండెంపై దుస్తులు ఆరవేస్తుండగా కరెంట్షాక్కు గురై కేకలు వేశారు. ఈ కేకలు విన్న ఇంటి పక్కన ఉన్న డొనుక కొమురమ్మ(70) వారిని కాపాడేందుకు వెళ్లి తాను కూడా విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. నాగమణి, ఇద్దమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగిక దాడికి యత్నించిన ఒకరికి జైలు
వరంగల్ లీగల్ : బాలికపై లైంగిక దా డికి యత్నించి బెదిరింపులకు పాల్పడ్డ ఒకరికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ మంగళవారం హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. కమలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని స్థానిక జిల్లా పరిషత్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. అయితే 2018 ఆగస్టు 4న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఎవరు లేరని నిర్ధారించుకున్న అదే గ్రామానికి చెందిన ఎల్ల బోయిన గణేష్ (20) ఇంట్లోకి చొరబడ్డా డు. ఒంటరిగా ఉన్న బాలిక చేయిపట్టి లాగి ‘నువ్వంటే నాకు ఇష్టం.. నా కోరిక తీర్చు.. లేదంటే నిన్ను చంపుతాన’ని బెదిరించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత బాలిక గట్టిగా అరుస్తూ గణేష్ నుంచి తప్పించుకోని బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల వారు రావడంతో సదరు యువకుడు అ క్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలిపింది. చీకటి పడటంతో మరుసటి రోజు కమలాపూర్ పోలీస్స్టేషన్లో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కో ర్టు నేరం రుజువు కావడంతో ఎల్లబోయిన గణేష్కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసును పోలీస్ అధికారులు హరికృష్ణ, సందీప్, సూర్యప్రకాష్ విచారించారు. భరోసా కేంద్రం లీగల్ ఆఫీసర్ సీహెచ్ నీరజ, లైజన్ ఆఫీసర్ పరమేశ్వరి విచారణను పర్యవేక్షించగా, పీపీ రాజమల్లారెడ్డి కేసు వాదించారు. యాక్సిడెంట్ కేసులో మరొకరికి ఏడాది.. మరిపెడ/మరిపెడ రూరల్: నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామ పరిధి అమ్రియతండాకు చెందిన ఒకరికి తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు మరిపెడ ఎస్సై ఎస్కే తహెర్బాబా మంగళవారం తెలిపారు. 2014లో మరిపెడ మున్సిపాలిటీకి చెందిన భూక్య లక్ష్మణ్ పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై మరిపెడ మండలం దంటకుటతండాకు వెళ్లాడు. తిరిగి మరిపెడ బంగ్లాకు క్రమంలో నర్సింహుటపేట మండల పెద్దనాగారం గ్రామ పరిధి అమ్రియతండాకు చెందిన బానోత్ రమేశ్.. ట్రాక్టర్ను అజాగ్రత్తగా నడుపుతూ భవాని ఆలయం వద్ద బైక్ను ఢీకొనగా లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి భూక్య హోలీ మరిపెడ పీఎస్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై నాగభూషణం కేసు నమోదు చేశారు. కేసు వి చారణ అనంతరం తొర్రూరు సివిల్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గణేష్ ఆనంద్ వాదించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి మట్ట సరిత.. బానోత్ రమేశ్కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై తెలిపారు. -
జనగామలో బాలిక కిడ్నాప్!
● కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురిపై కేసు జనగామ : జనగామ పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. బాలికకు ఓ వ్యక్తితో రెండు నెలల క్రితం ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. రోజువారీగా చాటింగ్ చేస్తున్న క్రమంలో బాలికను హైదరాబాద్కు రావాలని కోరగా, ఆమె అంగీకరించినట్లు తెలిపారు. జనగామకు చెందిన ముగ్గురు వ్యక్తుల సాయంతో ఈ నెల 12వ తేదీ రాత్రి సెల్ఫ్ డ్రైవింగ్ (జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనం) కారు తీసుకుని హైదరాబాద్కు వెళ్లిందన్నారు. బాలిక కనిపించడం లేదనే కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆరా తీయగా, జనగామకు చెందిన కారులో వెళ్లినట్లు సమాచారం అందగా కారు ఓనర్ను పిలిపించామన్నారు. కారుకు జీపీఎస్ ఉండడంతో దాని ఆధారంగా బాలిక ఉన్న ప్రదేశం కనిపెట్టి, నలుగురు వ్యక్తులతో పాటు ఆమెను తీసుకొచ్చామన్నారు. బాలిక వాంగ్మూలం రికార్డు చేసినట్లు, కిడ్నాప్ చేశారని తేలితే నలుగురిని రిమాండ్కు పంపిస్తామన్నారు. ఇటీవల రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలు, బాలికలను మాయమాటలతో ట్రాప్లో పడేస్తూ..అమ్మకానికి పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మానుకోటలో రెండిళ్లలో చోరీ ● మూడు తులాల బంగారం, 19 తులాల వెండి, రూ.5 వేల నగదు అపహరణమహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఇరువురి ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో మూడు తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలు, రూ.5 వేల నగదు అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్ కెనరా బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న బానోత్ సతీష్, కుటుంబ సభ్యులు కలిసి ఓటు వేసేందుకు ఇటీవల సొంతూరుకు వెళ్లారు. మంగళవారం ఉదయం వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండడం కనిపించింది. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. టౌన్ ఎస్సై శివ, ఫింగర్ ప్రింట్స్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే వారి పక్కింట్లో నివాసం ఉండే నరేష్ ఇంట్లోనూ దొంగలు పడి తులం బంగారు చైన్ ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లలో చోరీలకు యత్నించినప్పటికీ ఎలాంటి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దోచుకుపోలేదు. ఘటనలపై బాధితులు టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
చెన్నారావుపేట : తోటిమిత్రులు దాడి చేయడంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మండలంలోని ఎల్లాయగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎ స్సై అరుణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జనార్దన్ కుమారుడు నితీష్ను తన స్నేహితులు గొడవపడి సోమవారం సాయంత్రం కొట్టారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక గ్రామశివారులో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భయపడిన వెంటనే నితీష్ తన తండ్రికి ఫోన్ చేసి మందు తాగిన విషయం చెప్పడంతో చికిత్స నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నితీష్ తండ్రి ఫిర్యాదు మేరకు అర్కాల రాజేష్, పుటికల చంద్రకిరణ్, చరణ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రైలునుంచి పడి యువకుడి మృతి
కాశిబుగ్గ: ౖరెలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చింతలపల్లి, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ సీఐ నరేష్ కథనం ప్రకారం.. ముంబాయికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అన్సారి (18) తన బావతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కొంత కాలంగా ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే అన్సారి.. తన బావ, స్నేహితుడితో కలిసి ముంబాయి వెళ్లడానికి రాజమండ్రిలో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ధర్మారం రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి పడ్డాడు. దీంతో అప్లైన్ ట్రాక్ పక్కన పడి మృతి చెందాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్ఎస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బావ ఫక్రుద్దీన్ అన్సారీకి అప్పగించామని సీఐ తెలిపారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.. సంగెం/కాశిబుగ్గ: మద్యం మానలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. మండలంలోని కుంటపల్లికి చెందిన కలకొండ సుగుణ, సదానందం దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్, మహేందర్(28) ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి పెద్దమ్మ, పెద్ద నాన్న జయలక్ష్మి, వెంకటనారాయణ పెంచారు. మహేందర్ కులవృత్తి వండ్రంగితో పాటు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం చింతలపల్లి–ఎల్గూర్స్టేషన్ మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు రమేష్కు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
ప్రమాదాలకు కేరాఫ్.. దాబాలు
జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రదేశాల్లోనే ఏర్పాటు ● రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురి మృతి ● పట్టించుకోని అఽధికారులు, పోలీసులుస్టేషన్ఘన్పూర్: సాధారణంగా జాతీయ రహదారిపై క్రాసింగ్లు.. యూ టర్న్లు ఉన్న ప్రదేశాల్లో దాబాల (హోటళ్లు) ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే వాయువేగంతో దూసుకొచ్చే వాహనాలు అదుపు తప్పి ఈ హోటళ్లను ఢీకొంటే తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే, భోజనం చేసి బయటకు వచ్చే సమయంలో ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో దాబాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే హైదరాబాద్–హనుమకొండ జాతీయ రహదారిపై నియోజకవర్గ కేంద్రం స్టేషన్ఘన్పూర్లో మాత్రం ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఏ కారణం చేతనో కాని అధికారులు అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు ఆయా ప్రదేశాల్లోనే ఏర్పాటు చేశారు. మండలంలోని మీదికొండ క్రాస్ వద్ద ఒకటి, స్టేషన్ఘన్పూర్లో పాత శ్రీవాణి స్కూల్ సమీపాన మరొటి, పల్లగుట్ట క్రాస్ సమీపం ఎస్సీ కాలనీ వద్ద రెండు.. మొత్తం నాలుగు ప్రమాదకర ప్రదేశాల్లోనే ఏర్పాటు చేశారు. ఫలితంగా భోజనం, ఇతర పదార్థాలు భుజించడానికి గతంలో ఆయా దాబాలకు వచ్చిన పలువురు పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. అయినా సంబంధిత అధికారులు, స్థానిక పోలీసులు ఈ విషయమై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కాగా, మండలంలోని మీదికొండ క్రాస్ వద్ద ఉన్న దాబాహోటల్ సమీపంలో ఏడాది క్రితం రాజధాని బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా జాతీయ రహదారిపై ఇటీవల పలు రోడ్డు ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులకు పట్టడం లేదు. ఈ విషయంలో సంబంధిత అఽధికారులు, పోలీసులకు అమ్యామ్యాలు అందుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేరుకే ఫ్యామిలీ దాబా..పేరుకే ఫ్యామిలీ దాబా. లోపల మాత్రం ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. అటు ఎకై ్సజ్.. ఇటు సివిల్ పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో దాబాల వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా నడుస్తోంది. యజమానులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. ఇదిలా ఉండగా గతంలో దాబాల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇళ్లలో కట్టేసిన పశువుల అపహరణ
నర్సంపేట రూరల్ : ఇళ్లలో కట్టేసిన గేదెలు, ఆవులు, దూడలను అపహరిస్తున్న ఓ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు చిక్కగా, మరో ముగ్గురు పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామ శివారు ఐదోవార్డులో రాత్రి వేళలో కొందరు ముఠాగా ఏర్పడి గేదెలు, ఆవులు, దూడలను అపహరిస్తున్నారు. సోమవారం రాత్రి సైతం ఇదే విధంగా నలుగురు వచ్చి పలు ఇళ్లలోని దూడలను, గేదెలు తీసుకెళ్తుండగా అలజడి వచ్చింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా లేచి వారిని వెంబడించడంతో గేదెలు, దూడలను వదిలి పారిపోయారు. ఆ ముఠాలో ఓ మహిళ చేతికి చిక్కడంతో ఆమెను స్తంభానికి కట్టేసి మిగతా ముగ్గురి కోసం గాలించారు. వారు దొరకక పోవడంతో మంగళవారం ఉదయం సదరు మహిళను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.● మహిళను స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు ● పోలీసులకు అప్పగింత -
మెస్ ఓపెన్ చేయాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి మహిళా మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ , ఏబీఎస్ఎఫ్, పీడీఎస్యూ నాయకులు మంద శ్రీకాంత్, మంద నరేష్, మర్రి మహేష్, తదితరులు మద్దతు పలికారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్రావు ఘటనాస్థలికి చేరుకుని ఆయా సంఘాల నాయకులు, విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల సంఖ్య సరిపడా ఉంటేనే మెస్ను ఓపెన్ చేస్తామని వారికి తెలిపారని సమాచారం. ఈ సందర్భంలో డైరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత విద్యార్థినులు, ఆయా సంఘాల బాధ్యులు క్యాంపస్లోని పరిపాలన భవనానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కామన్మెస్, పద్మాక్షి మహిళా హాస్టళ్ల మెస్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ రమేశ్తో కలిసి మెస్లు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈనెల 15నుంచి మహిళా హాస్టల్ మెస్ను రీఓపెన్ చేయిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. సరిపడా విద్యార్థులు వచ్చాకే (బాయ్స్కు) కామన్ మెస్ రీఓపెన్ చేయిస్తామని విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులకు తెలియజేశారని సమాచారం. దీంతో ఆందోళన విరమించారు. కాగా, పీజీ, ఇతర కోర్సులు కలిగిన విద్యార్థినులు మెస్కార్డులు కలిగివారిలో 25శాతం మంది వస్తే మెస్ను రీఓపెన్ చేస్తామని, కామన్మెస్లో కూడా 25శాతం మంది విద్యార్థులు వస్తే రీఓపెన్ చేస్తామని హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్రావు వివరణ ఇచ్చారు. కేయూలో విద్యార్థినుల ఆందోళన రిజిస్ట్రార్ మల్లారెడ్డితో వాగ్వాదం మెస్లు ఓపెన్.. కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం రాత్రి మెస్లు ఓపెన్ అయ్యాయి. మెస్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పద్మాక్షి మహిళా హాస్టల్లో వర్కర్లతో వంట చేయించారు. అనంతరం పద్మాక్షి హాస్టల్ విద్యార్థినులు, అలాగే అక్కడి నుంచి కామన్ మెస్కు తీసుకొచ్చి విద్యార్థులకు(బాయ్స్) భోజనం వడ్డించారు. కాగా, నేటినుంచి (బుధవారం) కామన్మెస్, పద్మాక్షిమెస్ యథావిధిగా కొనసాగించబోతున్నారు. విద్యార్థులు ఎక్కువమంది వస్తే రెండు చోట్ల వంటచేసి మెస్ సదుపాయం కల్పించాలని, లేనిపక్షంలో ఒకే చోట వంట చేసి పద్మాక్షి హాస్టల్ విద్యార్థినులు, కామన్మెస్కు సదుపాయం కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. -
No Headline
మూడేళ్లలో నలుగురు హాస్టళ్ల డైరెక్టర్లు విధులు! కేయూ వీసీ రమేశ్ 2021 మే 23న బాధ్యతలు స్వీకరించా రు. ఈనెల 21న మూడేళ్లు పదవీ కాలం పూర్తికాబోతుంది. రమేశ్ బాధ్యతలు స్వీకరించేనాటికే హాస్టళ్ల డైరెక్టర్గా జువాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎం ఇస్తారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017సెప్టెంబర్ నుంచి 20 22 ఫిబ్రవరి వరకు కొనసాగారు. పలు కారణాలతో ఆ యన పదవికి రాజీనామా చేయగా 2022 మార్చిలో కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ మంజులను నియమించారు. 2023 జూలై 4వరకు కొనసాగుతుండగానే ఆమె స్థానంలో జువాలజీ విభాగం ప్రొఫెసర్ వై వెంకయ్యను 2023 జూలై 5న నియమించారు. అనంతరం ఆయన స్థా నంలో 2024 జనవరిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్రావును నియమించారు. నాలుగు నెలలు 5రోజులకే రాజీనామా చేయగా ఆయన స్థానంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యను నియమించారు. -
యథేచ్ఛగా గుట్టను తవ్వేస్తున్నారు
హసన్పర్తి : మండలంలోని దేవన్నపేట ప్రభుత్వ పాఠశాల సమీపంలో గల గుట్ట క్వారీగా మారింది. అనుమతి లేకుండానే గుట్టను తవ్వేస్తున్నారు. అధికారులు కనుసన్నల్లో మట్టి దందా జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవన్నపేట పరిధిలోని సర్వే నంబర్ 217లో సుమారు 17.02 ఎకరాల గుట్ట ఉంది. ఓ రియల్టర్ ఈ గుట్టను క్వారీగా మార్చేసి, రాత్రింబవళ్లు తేడా లేకుండా పొక్లెయినర్ సాయంతో మట్టిని తవ్వుతూ టిప్పర్ల ద్వారా నగరానికి తరలించి విక్రయిస్తున్నాడు. కొంతమంది అధికార పార్టీ నాయకులు, అధికారుల అండాతోనే సదరు వ్యాపారి మొరం దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి అక్రమంగా మట్టి దందా కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మట్టి క్వారీ తవ్వేందుకు మైనింగ్ అనుమతి తప్పనిసరి. అయితే క్యూబిక్ మీటరుకు రూ.70ల నుంచి రూ.80 వరకు ప్రభుత్వానికి చలానా రూపంలో నగదు చెల్లించాల్సి ఉంటోంది. ఒక టిప్పర్ మట్టికి రూ.1,000 నుంచి రూ.1,200ల నగదు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పటికి ఈగుట్ట నుంచి వేలాది టిప్పర్ల మట్టి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు సదరు యజమానిపై చర్యలు తీసుకోకుండ వెనుకంజ వేస్తున్నారని విమర్శలున్నాయి. అనుమతి లేకుండా వ్యాపారం పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు -
ఏజెన్సీలో పోలీసు బాస్
● జిల్లాను జల్లెడపట్టిన పోలీసు యంత్రాంగం మహబూబాబాద్ రూరల్/గూడూరు/గంగారం: కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. స్వయంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగడంతోపాటుగా ప్రజలు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందస్తుగా ఎస్పీ ఆదివారం రాత్రి జిల్లాలోని డోర్నకల్ మండలంలోని ఉయ్యాలవాడ, కురవి మండలం మొగిలిచర్ల, సీరోలు, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామాలను సందర్శించి తనిఖీ చేశారు. సోమవారం ఉద యం మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడి నుంచి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం, మొట్ల తిమ్మాపురం, రంగాపురం, గంగారం మండలంలోని కామారం, మర్రిగూడెం, గూడూరు మండలంలోని గుండెంగ, దంతాలపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్తండా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. -
ఆ నాలుగు మండలాల్లో ముందే..
● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి మానుకోట జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల, ములుగు నియోకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 4గంటలకు ముగింశారు. కాగా ఎప్పుడు పోలింగ్లో వెనకబడి ఉండే ఈ ప్రాంతాల్లో 74శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటరు చైతన్య, అవగాహన కార్యక్రమాలు, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతోనే పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో నమోదైన పోలింగ్శాతం మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్శాతం కొత్తగూడ 23,460 17,126 73 గంగారం 9,041 7,395 82 బయ్యారం 38,092 26,530 69 గార్ల 30,399 21,603 72 -
ఈవీఎంపై రైట్ గుర్తులు
మరిపెడ రూరల్/ బయ్యారం: మరిపెడ మండలంలోని లూనావత్తండా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో చేతి గుర్తు ఎదుట రైట్గుర్తు పెట్టి.. టిక్ చేసి ఉన్న చేతి గుర్తుకు ఓటు వేయాలని పోలింగ్ బూత్ బయట ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఏజెంట్ ఆరోపించాడు. అందుకు సంబంధించిన ఈవీఎం ఫొటో తీసి వాట్సాప్ ద్వారా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ఏజెంట్ తెలిపాడు. అయితే సిబ్బంది రైట్ గుర్తును చెరిపేసి పోలింగ్ను కొనసాగించారు. అలాగే మండలంలోని బీచ్రాజ్పల్లి పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే బయ్యారం మండలంలోని వెంకట్రాంపురంలోని 26వ పోలింగ్బూత్లో గుర్తుతెలియని వ్యక్తి ఈవీఎంలో ఉన్న చేతిగుర్తు వద్ద ఇంకుమార్కు పెట్టడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకుమార్కు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గంటపాటు ఆ బూత్లో పోలింగ్ను నిలిపివేసిన సిబ్బంది మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ను కొనసాగించారు. -
కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధిలోని గాంధీపురం, అనంతారం శివారులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆదివా రం రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసిపోయింది. అధికారులు సరిపడా టార్పాలిన్లు అందజేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు. సోమవారం ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. మంత్రాల నెపంతో వ్యక్తిపై దాడికొత్తగూడ: మంత్రాల నెపంతో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన మండలంలోని వేలుబెల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు సింగం యుగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను శివసత్తిగా శివ పూజలు చేసుకుంటానని తెలిపాడు. దీన్ని సాకుగా చూపిస్తూ.. తనకు మంత్రాలు వస్తాయని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన మొర్లి కృష్ణ, అతడి భార్య సరోజ, లక్ష్మీనర్సు తనపై కర్రలతో దాడి చేసి గాయపర్చినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న ఎస్సై దిలీప్ బాధితుడిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపా రు. కేంద్రాల పరిశీలన నెల్లికుదురు: మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో తొర్రూరు డీఎస్పీ సురేష్ 80 ఏళ్ల వృద్ధురాలిని వీల్చైర్లో కూర్చోబెట్టి ఓటింగ్కు పంపించారు. అలాగే మండలంలోని ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి పోలింగ్ కేంద్రాలను ఎస్సై కాంతికిరణ్తో కలిసి ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం గ్రామాల్లో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. గాంధీపురంలో ఘర్షణమహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి గాంధీపురం నాలుగోవార్డు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ సమీపంలో సోమవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఇది గమనించిన బీఆర్ఎస్ నాయకులు వారి ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు వాగ్వాదానికి దిగారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కాంగ్రెస్ నాయకులు బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకొని తింటుండగా.. బీఆర్ఎస్ నాయకులు వారిపై దౌర్జన్యం చేశారు. మీరే తింటారా మాకు కూడా ప్యాకెట్లు ఇవ్వాలని దాడి చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడి తలపై బలమైన దెబ్బ తగిలింది. కాగా ఆ యువకుడి తండ్రి మానుకోట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈమేరకు పోలీసులు గాంధీపురం పోలింగ్ బూత్ సమీపానికి చేరుకొని ఇరువర్గాల నాయకులను చెదరగొట్టారు. హమ్మయ్య దొరికారు..కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాల్లో వైద్య సిబ్బంది సికిల్సెల్ ఎనిమియా వ్యాధి నిర్ధారణ కోసం యువతీ యువకులకు రక్తపరీక్షలు చేస్తున్నారు. అయితే పీహెచ్సీ సిబ్బందికి కొంతమంది యువత అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన వారి నుంచి పోలింగ్ కేంద్రం వద్ద రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు ఇక్కడ దొరికారు అంటూ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా..బయ్యారం: మండల కేంద్రానికి చెందిన సొసైటీ మాజీ చైర్మన్ తిరుమల సంజీవరెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి వాహనంలో వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
మంచి నేతకు తొలి ఓటు వేశా
వరంగల్ శివనగర్ ప్రకాశ్ మెమోరియల్ హైస్కూల్లోని 167వ పోలింగ్ బూత్లో నా తొలి ఓటు హక్కు వినియోగించుకున్నా. నిజాయితీ గల మంచి నాయకుడికి ఓటు వేశా. అభివృద్ధిని ఆకాంక్షించి మంచి నాయకుడి గెలుపునకు ఓటు వేశా. – శామంతుల తేజ్ దీప్తి, శివనగర్ ఓటు హక్కు గొప్పది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గొప్పది. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నా. ప్రజలకు సేవ చేసే నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. – గోరంటల మణిచరణ్, బీటెక్, ఫైనలియర్, వరంగల్ మంచి నాయకుడిని ఎన్నుకోవడం అదృష్టం నేను మొదటిసారి ఓటు వేసినందుకు గర్వపడుతున్నా. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి నా ఓటు హక్కు దోహదపడింది. దేశానికి సేవ చేసే ప్ర జాప్రతినిధులు.. ఎన్నికై న అ నంతరం అందరికీ మేలు చేయాలి. అదే నా కోరిక. – గుగులోత్ నిఖిత, మహబూబాబాద్ -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: సీబీఎస్ఈ టెన్త్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు ఎ మధుకర్రెడ్డి, ఎ సంతోష్ తెలిపారు. 500 మార్కులకుగాను జి వర్ష 485, టి సాయి ప్రణవ్రెడ్డి 484, ప్రేమ్చరణ్సాహు 481 మార్కులు, డి శ్రేష్టరెడ్డి 477 మార్కులు సాధించారని వారు తెలిపారు. ఈ విజయానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్య, పటిష్ట ప్రణాళిక, అంకితభావం కలిగిన అధ్యాపక బృందం అని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు. 12వ తరగతి ఫలితాల్లో.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు ఎ మధుకర్రెడ్డి, ఎ సంతోష్రెడ్డి తెలిపారు. ఎంపీసీలో 500 మార్కులకు పి మేఘన 482 , తుమ్మ తేజస్వి 480, రిషికేష్రెడ్డి 478 మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయం సాధించిన విద్యార్థులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి వారు అభినందనలు తెలిపారు. -
మూడు గుట్టలు..16 కిలోమీటర్లు..
● కాలినడకన వచ్చి ఓటు వేసిన పెనుగోలు వాసులు వాజేడు: అది గుట్టలపై ఉన్న ఆదివాసీల కుగ్రామం. మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో ఉన్న పెనుగోలు. ఇక్కడ 12 కుటుంబాలు, 30 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో 22 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును క్రమం తప్పకుండా వినియోగించుకుంటున్న వీరు.. సోమవారం కూడా మూడు గుట్టలు దిగి వచ్చి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేశారు. గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామం నుంచి కాలి నడకన గుమ్మడి దొడ్డి వరకు 16 కిలో మీటర్లు వచ్చిన వారిని.. తహసీల్ కార్యాలయ సిబ్బంది ఆటో ద్వారా జంగాలపల్లి పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఓటు వేసిన తరువాత వారు విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని గుట్టలు దిగి వచ్చి ఓటు వేసినట్లు తెలిపారు. -
ఓటు వేసిన వీడియో వైరల్..
● వ్యక్తిపై కేసు నమోదు నెల్లికుదురు : మండలంలోని హేమ్లా తండాలో ఓ వ్యక్తి ఓటు వేస్తూ వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరలైంది. ఈ ఘటనలో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికిరణ్ సోమవారం తెలిపారు. తండాలోని 160 పోలింగ్ కేంద్రంలో తండాకు చెందిన బానోత్ బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య పోలింగ్ కేంద్రం సమీపంలో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ విషయంపై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎస్. నాగరాజు ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు. మానుకోటలో యువకుడిపై.. మహబూబాబాద్ రూరల్ : తాను ఓ పార్టీకి ఓటు వేసిన దృశ్యాలను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అతడిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి గాంధీపురం గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీకాంత్ స్థానిక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అదేవిధంగా తాను ఏ పార్టీకి ఓటు వేశాడో అనే విషయ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వీరన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ ఎస్సై వి.దీపికారెడ్డి తెలిపారు. వీవీ ప్యాట్ ఫొటో వైరల్ సంగెం: మండలంలోని ఎల్గూర్స్టేషన్లోని 211 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వచ్చిన ఫొటో తీసి గుగులోత్ గోపి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశాడు. దీంతో అతడిపై చర్య తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సెక్టార్ అధికారి సాయిరాజ్తో వాగ్వాదానికి దిగారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు సెక్టార్ అధికారి సాయిరాజ్ తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement