యువకుడి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్యాయత్నం

Published Wed, May 15 2024 6:05 AM

-

చెన్నారావుపేట : తోటిమిత్రులు దాడి చేయడంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మండలంలోని ఎల్లాయగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎ స్సై అరుణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జనార్దన్‌ కుమారుడు నితీష్‌ను తన స్నేహితులు గొడవపడి సోమవారం సాయంత్రం కొట్టారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక గ్రామశివారులో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భయపడిన వెంటనే నితీష్‌ తన తండ్రికి ఫోన్‌ చేసి మందు తాగిన విషయం చెప్పడంతో చికిత్స నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నితీష్‌ తండ్రి ఫిర్యాదు మేరకు అర్కాల రాజేష్‌, పుటికల చంద్రకిరణ్‌, చరణ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement