-
ప్రతి చోట పెరిగిన ఓటింగ్
పోలింగ్కు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోటెత్తారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు తరలివచ్చారు. గతంతో పోలిస్తే జిల్లాలో ఈసారి దాదాపు రెండు నుంచి మూడు శాతం మేర పోలింగ్ పెరిగింది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 83 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడం.. ప్రతిపక్షంపై సానుకూలత లేకపోవడం వంటి అంశాలపై విశ్లేషకులు తమ మనోగతాన్ని తెలియజేస్తున్నారు. ఈ పోలింగ్ సరళి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపుతుందని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం తాము ప్రకటించిన మేనిఫెస్టో అనుకూలంగా మారిందని ప్రచారం చేసుకుంటూ ఆనందం పొందుతోంది. డబ్బును పారించిన పచ్చ పార్టీ క్షేత్రస్థాయిలో టీడీపీ గ్రాఫ్ అంత గొప్పగా లేకపోవడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వానికి తెరలేపారు. ఓటుకు భారీ మొత్తంలో పంపిణీ చేశారు. అయితే సంక్షేమ సారథి జగన్మోహన్రెడ్డికే ప్రజలు జై కొట్టారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు భారీగా ఓటేశారని తెలుస్తోంది. -
చింతవరంలో వ్యక్తిపై దాడి
చిల్లకూరు: తీర ప్రాంతంలోని చింతవరం గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేయడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. చింతవరం గ్రామానికి చెందిన జాలాది గోపాల్ అదే గ్రామంలో రైతు డిపో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం జరిగిన ఎన్నికల్లో స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద చింతవరం కొత్తపాళెం గ్రామానికి చెందిన యువకులతో కొంత వివాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గోపాల్ రైతు డిపో తెరిచే సమయంలో చింతవరం కొత్తపాళేనికి చెందిన దిలీప్, చెంచయ్య, కాంత్రి అక్కడికి చేరుకుని అతనితో గొడవపడ్డారు. రాడ్డుతో తలపై మోదడంతో గోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. యువకులు పారిపోయారు. గమనించిన స్థానికులు బాధితుడిని నెల్లూరులోని ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చైన్నెకి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
TTD: శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. స్వామివారిని 70,815 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకోగా, తలనీలాలను 25,245 మంది భక్తులు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారికి రెండు గంటల్లో దర్శనమవుతోంది. -
స్ట్రాంగ్రూమ్కు చేరిన ఈవీఎంలు
● మూడంచెల భద్రత నెల్లూరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, వివిధ కారణాలతో సోమవారం రాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో గల స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. వీటికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో మంగళవారం సీల్ వేశారు. మూడంచెల భద్రతను జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లా పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు బందోబస్తు విధులను నిర్వర్తిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎవర్నీ అనుమతించొద్దని ఆదేశించారు. ఈవీఎంలలో భవితవ్యం నిక్షిప్తం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై రాజకీయ పార్టీలు ధీమాతో ఉన్నాయి. పోలింగ్ సరళిపై ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. నియోజకవర్గాల పరిధిలోని వార్డులు, గ్రామాల వారీగా జరిగిన పోలింగ్ను పరిశీలిస్తున్నారు. ఓటరు తీర్పు, నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. విజయం ఎవరిదో జూన్ నాలుగున తేలనుంది. -
మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
నెల్లూరు(అర్బన్): ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న ఓ మహిళా రోగికి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడామని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్రెడ్డి, హెడ్ ఆఫ్ ది క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ రాజేష్రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన 26 ఏళ్ల సుభాషిణి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ గత వారం తమ ఆస్పత్రిలో చేరిందన్నారు. అన్ని రకాలు పరీక్షలు చేయగా ఊపిరితిత్తుల్లో గడ్డ ఏర్పడి చీము పట్టినట్లు గుర్తించామన్నారు. ఇలాంటి అరుదైన రోగులను చైన్నె, హైదరాబాద్ వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు డాక్టర్లు రోగులను రెఫర్ చేస్తారన్నారు. అయితే తాము ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నట్లు చెప్పామన్నారు. రోగి తల్లిదండ్రులకు రిస్క్ను వివరించామన్నారు. వారి సమ్మతితో ఆపరేషన్ను విజయవంతం చేశామన్నారు. హాస్పిటల్లో అత్యంత అధునాతన ల్యాబ్, థియేటర్, పరికరాల వల్లే తాము ఇలాంటి రోగులకు వైద్యం అందించామన్నారు. -
ఎన్నికలు ఏకపక్షం
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఈవీఎంలలో నేతల భవితవ్యం నిక్షిప్తమైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా పెరిగిన పోలింగ్ సరళి అటు పార్టీలు.. ఇటు అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కౌంటింగ్కు మరో 20 రోజులు ఉండటంతో నరాలు తెగే ఉత్కంఠ, ఊపిరి సలపని విధంగా టెన్షన్ పెరుగుతోంది. ఓటింగ్ శాతం భారీగా పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని టీడీపీ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పరవళ్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరకపోగా, నానాటికీ అధికమవుతోంది. ఈ తరుణంలో ఈ ఎన్నికలూ ఏకపక్షమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమ ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో సంక్షేమ పథకాలు, అభివృద్ధితో రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి పరుగులు పెట్టించారు. ఈ తరుణంలో ఆయనకే ప్రజలు మరోసారి జై కొట్టారనే టాక్ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. ఇది కదా అభివృద్ధి.. ● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షలపైగా ఉద్యోగాలను కల్పించారు. దీని ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను అందించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర అమలు చేసి ప్రజాభిమానాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి చూరగొన్నారు. ● వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్లతో మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇంటి వద్దే వైద్యసేవలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ● పేదంటి పిల్లలు ఉన్నత చదువులను అభ్యసించేందుకు వీలుగా నాణ్యమైన విద్యకు పునాదులేశారు. ● రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించేలా ప్రణాళికలను రూపొందించారు. ● పరిశ్రమలు.. పోర్టు.. హార్బర్తో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనిపించడంలేదు. విష ప్రచారంతోనే పబ్బం 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు.. తాజా ఎన్నికల్లో విష ప్రచారాలతో పబ్బం గడుపుకొన్నారు. సంక్షేమ పథకాలతో శ్రీలంక మాదిరిగా రాష్ట్రం తయారవుతుందని.. వలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని.. ఇలా విషం చిమ్మిన ఆయన ఎన్నికల సమయానికి మాట మార్చేశారు. వీటి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ బూటకపు ప్రచారాలకు మరోసారి తెరలేపారు. ఇవన్నీ ఓ ఎత్తయితే ఎన్నికల సమయాన తన మనుషులతో ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి పింఛన్ల పంపిణీ ప్రక్రియకు వలంటీర్లను దూరం చేశారు. ఈ పరిణామాలతో పింఛన్లు పొందేందుకు అవ్వాతాతలు, దివ్యాంగులు నానా అగచాట్లు పడ్డారు. ఎండల తీవ్రత తాళలేక.. వీటిని సకాలంలో పొందలేక వీరు పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇవన్నీ చంద్రబాబుకు ప్రతికూలంగా మారాయి. డబ్బును పారించిన పచ్చ పార్టీ క్షేత్రస్థాయిలో టీడీపీ గ్రాఫ్ అంత గొప్పగా లేకపోవడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వానికి తెరలేపారు. ఓటుకు భారీ మొత్తంలో పంపిణీ చేశారు. అయితే సంక్షేమ సారథి జగన్మోహన్రెడ్డికే ప్రజలు జై కొట్టారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు భారీగా ఓటేశారని తెలుస్తోంది. గత సరళే కనిపించిందంటున్న విశ్లేషకులు భారీగా పోలింగ్ పోటెత్తిన మహిళా ఓటర్లు సర్వేపల్లిలో 83 శాతం నమోదు మండలాల్లోనూ ఇదే తీరు -
ఓటెత్తిన చైతన్యం
● అధికారుల చర్యలతో పెరిగిన పోలింగ్ శాతం నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేందుకు వృద్ధులు, దివ్యాంగుల ఓట్లు దోహదపడ్డాయి. ఎన్నికలకు ముందే అధికారులు తగు చర్యలు చేపట్టడంతో ఈ లక్ష్యం ఆవిష్కృతమైంది. ఈసారి 85 ఏళ్లుపైబడిన వృద్ధులు తమ ఇళ్ల వద్దే ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీని కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి విస్తృతంగా అవగాహన కల్పించారు. మరోవైపు ఓటింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల సౌకర్యార్థం వీల్చైర్లు.. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందుల్లేకుండా తాగునీటి వసతి, టెంట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు 2,93,157 మందికి గానూ 2,73,157 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం. జిల్లాలో 80 శాతం పోలింగ్ నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది కొంత మేర పెరిగింది. అత్యల్ప ఓటింగ్ శాతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నమోదైంది. పోలింగ్ వివరాలు.. నియోజకవర్గం శాతం కావలి 83.03 ఆత్మకూరు 83.49 కోవూరు 79.28 నెల్లూరు సిటీ 71.72 నెల్లూరు రూరల్ 67.75 సర్వేపల్లి 83.88 కందుకూరు 88.96 ఉదయగిరి 81.90 -
వైఎస్సార్సీపీ విజయం ఖాయం
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వెంకటగిరిరూరల్: సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టారని, ఈసారి కూడా ప్రభంజనం సృష్టిస్తామని ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు, మంచితో రాష్ట్ర ప్రజలు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 80 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు. కార్యకర్తలు, నేతలు తన గెలుపు కోసం కృషి చేశారని, అదేవిధంగా వలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేసినట్లు పేర్కొన్నారు. వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులకు ఎళ్లవేళలా అండగా ఉండనున్నట్లు తెలిపారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఓటమి భయంతోనే రాష్ట్రంలో టీడీపీ నేతలు అల్లర్లకు పాల్పడుతున్నట్లు నేదురుమల్లి చెప్పారు. దీంతో పలుచోట్ల వివాదాలకు తెరలేపుతూ, విధ్వంసాలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. పట్టణంలోని రాణిపేట సమీపంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నేదురుమల్లి తెలిపారు. ఆ ప్రాంతంలో అంబేడ్కర్ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ● వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని నేదురుమల్లి నివాసం మంగళవారం వైఎస్సార్సీపీ నేతలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు రామ్కుమార్రెడ్డి కలిశారు. -
రెండు మోటార్బైక్లు ఢీకొని యువకుడి మృతి
● ఇద్దరికి తీవ్రగాయాలు లింగసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టు బంగ్లా వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. ఎస్సై ఎం.బాజీబాబు కథనం మేరకు.. మొగిలిచర్ల గ్రామానికి చెందిన నాగినేని వేణుగోపాల్ (21), పడిదపు మాల్యాద్రి లింగసముద్రంలో స్నేహితులతో క్రికెట్ ఆడారు. మోటార్బైక్పై ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో మొగిలిచర్ల వెళ్లే రోడ్డులో రాళ్లపాడు ప్రాజెక్టు బంగ్లా మలుపు వద్ద కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన గొర్ల హరికృష్ణ లింగసముద్రం వైపు బైక్పై వైపు వస్తున్నాడు. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డుపై కిందపడ్డారు. వేణుగోపాల్ అక్కడికక్కడే మృతిచెందగా మాల్యాద్రి, హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వారు చూసి ఆటోలో వారిని లింగసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న వేణుగోపాల్ కుటుంబసభ్యులు లింగసముద్రం పీహెచ్సీకి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మాల్యాద్రి, హరికృష్ణలను కూడా కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై చెప్పారు. -
ఆరోగ్య భాగ్యం..
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే వైద్య రంగంలో పలు సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చింది. పెద్దాస్పత్రిలో డాక్టర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు నర్సింగ్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించారు. గత టీడీపీ పాలనలో ఓపీ సంఖ్య 700 నుంచి 800 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య వెయ్యి నుంచి 1200కుపైగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్ పేషెంట్లు సుమారు 300 మంది ఉండగా, ప్రస్తుతం 500 నుంచి 550 వరకు చేరింది. స్పెషాల్టీ సేవలు ప్రారంభం పెద్దాస్పత్రిలో న్యూరాలజీ, యూరాలజీ, ఆంకాలజీ విభాగాలను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించారు. కార్డియాలజీ విభాగాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కళాశాలలో తొలిసారిగా పీజీ సీట్లు గతేడాది రావడంతో రోగులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు మెడికల్ ఆంకాలజీ విభాగంలో ఓపీ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. రెండు నెలల క్రితం వరకు రోజుకు సుమారు 10 ఓపీ ఉండగా, ఇప్పుడది 50కు చేరింది. న్యూరాలజీలో రోజూ సుమారు 40 మందికిపైగా ఓపీ రోగులు వస్తున్నారు. యూరాలజీ విభాగంలోనూ ఇదే పరిస్థితి. పల్మనాలజీ, కీళ్లు – ఎముకలు, చర్మ, ఈఎన్టీ.. నాణ్యమైన చిన్నపిల్లల విభాగం, పీడీయాట్రిక్ ఐసీయూ, గైనకాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో అత్యాధునిక పరికరాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం లేని విధంగా పెద్దాస్పత్రిలో అత్యంత ఆధునిక పరికరాలైన ఎమ్మారై, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు చేస్తున్నారు. రోగ నిర్ధారణకు అవసరమైన అన్ని రకాల రక్త పరీక్షలు, ఎక్స్రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, 2డీ ఎకో పరికరాలతో పాటు ఆధునిక ల్యాబ్ కోసం ప్రత్యేక భవనాన్ని సిద్ధం చేశారు. క్రిటికల్ కేర్ భవన నిర్మాణం వేగవంతం క్రిటికల్ కేర్ భవనాన్ని రూ.23.75 కోట్లతో 51 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ + 2లో నిర్మిస్తున్నారు. ఆస్పత్రి మెయింటెనెన్స్కు రూ.35 లక్షలు విడుదలయ్యాయి. ఇవన్నీ పూర్తయి త్వరలోనే సేవలు ప్రారంభంకానున్నాయి. దీంతో రోగులకు ఏసీతో కూడిన ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి జీజీహెచ్లో ఓపీ స్లిప్పు కోసం బారులు పెద్దాస్పత్రిలో సూపర్ స్పెషాల్టీ సేవలు ఆధునిక యంత్రాలతో వ్యాధుల గుర్తింపు రానున్న అదనపు నిధులు పెరిగిన ఓపీ, ఐపీ సేవలు వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రజలకు నాణ్యమైన స్పెషాల్టీ సేవలను అందించాలనే లక్ష్యంతో నిధులు, భవనాలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా నగరంలోని దర్గామిట్టలో గల జీజీహెచ్లో సూపర్ స్పెషాల్టీ డాక్టర్లను నాలుగు నెలల క్రితం నియమించి సేవలను ప్రారంభించారు. ఇప్పటి వరకు నరాలు, కేన్సర్, మూత్రాశయం లాంటి సమస్యలకు కార్పొరేట్ ఆస్పత్రులకెళ్లి లక్షలను ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం పేద, ధనిక అనే తేడా లేకుండా పెద్దాస్పత్రిలో నాణ్యమైన సూపర్ స్పెషాల్టీ వైద్యసేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించారు. దీంతో సాధారణ, స్పెషాల్టీ విభాగాల్లో ఓపీ సేవల సంఖ్య గణనీయంగా పెరిగింది. సేవలను వినియోగించుకోండి కొన్ని రకాల సూపర్ స్పెషాల్టీ సేవలను ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొన్ని సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పెద్దాస్పత్రిలో అన్ని రకాల ఆధునిక పరీక్షలు జరుగుతున్నాయి. సూపర్ స్పెషాల్టీ సేవలకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పెద్దాస్పత్రిలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – సిద్ధానాయక్, సూపరింటెండెంట్, జీజీహెచ్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
పొదలకూరు: మండలంలోని తాటిపర్తికి సమీపంలో వృద్ధుల ఆశ్రమం మలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు.. నల్లపాళెం గ్రామానికి చెందిన మహేంద్ర మోటార్బైక్పై పొదలకూరుకు వస్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయాడు. అతడి తలపై తీవ్రగాయం కావడంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.స్కూటీ దహనంకావలి: పట్టణంలోని ఇస్లాంపేటలో నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ బండి వెంకయ్య ఇంటి వద్ద ఉన్న స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు మంగళవారం కావలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సోయవారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టారని, స్కూటీ పక్కనే ఉన్న వాషింగ్ మెషీన్ కూడా కొంత మేర దెబ్బతిన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ వెంకయ్య ఎన్నికల విధుల్లో ఆత్మకూరులో ఉండగా కుటుంబసభ్యులు ఇంట్లో ఉన్నారు. న్యాయవాదులకు అవగాహనపుత్తూరు: న్యాయవాదులు మధ్యవర్తిత్వం చట్టంపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎస్సీ రాఘవేంద్ర సూచించారు. మంగళవారం స్థానిక సబ్కోర్టులో న్యాయవాదులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ వ్యాజ్యం కంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సంతృప్తికరమైన ఫలితం పొందవచ్చని వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడిన కేసుల్లో కోర్టు ఫీజులను వాపసు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంకా కక్షిదారులకు ఆందోళన తగ్గి, మనశ్శాంతి కలుగుతుందన్నారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జానకి మాట్లాడుతూ జూన్ 29వ తేదీన కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు న్యాయవాదులు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి మురళి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 6.813 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం 6.813 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు.హెడ్రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 220 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్ కాలువకు 70 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. పీజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంతిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో 2024 – 25 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమాశ్రీ మంగళవారం తెలిపారు. ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగా థెరఫీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పాసైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. అదేవిధంగా రెగ్యులర్ పద్ధతిలో ప్రాక్ శాస్త్రి కోర్సులో ప్రవేశానికి ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. -
గుర్తుతెలియని వృద్ధుడి ఆత్మహత్య
తడ: ఏం కష్టం వచ్చిందో తెలియదుగానీ ఓ వృద్ధుడు ఉరేసుకుని తనువు చాలించాడు. ఎస్సై పి.నరసింహారావు కథనం మేరకు.. మండలంలోని తడకండ్రిగ కారు స్టాండ్ వద్ద ఉన్న చెట్టుకు గుర్తుతెలియని వృద్ధుడు ఉరేసుకున్నట్లు మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వృద్ధుడు లుంగీ చింపి చెట్టుకు ఉరేసుకుని ఉన్నాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దింపి సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు నల్లటి ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. వైట్ కలర్ షర్టును తీసి పక్కన ఉంచాడు. అతని వద్ద నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమంలో ఇచ్చే అన్నదానం టికెట్ ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కోళ్ల ఫారంపై కూలిన చెట్టు
● రూ.3 లక్షలకు పైగా నష్టం పెద్దతిప్పసముద్రం: మండల కేంద్రానికి సమీపంలోని బోడిగుట్ట వద్ద షెడ్డు కూలి కోళ్లు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దతిప్పసమద్రానికి చెందిన ఎల్.రజీవుల్లా కుటుంబసభ్యులు కోళ్ల ఫారం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవా రం రాత్రి కురిసిన గాలివానకు చెట్టు కూలి సమీపంలోని కోళ్ల ఫారంపై పడింది. అక్కడి షెడ్డు గోడ నేలకొరగడంతో ఫారంలోని కోళ్లు మృతిచెందాయి. ఈ ఘటనలో రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు కంటతడిపెట్టారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కోరారు.గంగమ్మ నామావళి సీడీ ఆవిష్కరణతిరుపతి మంగళం: తాతయ్యగుంట గంగమ్మ తల్లి నామావళి సీడీని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పద్మావతిపురంలోని తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. వర్ణ మ్యూజిక్ అకాడమీ సమర్పణలో డాక్టర్ విజయలక్ష్మి రచించి, కోనేరు లక్ష్మీరాజ్యంతో కలిసి గానం చేయగా, ఆర్.కళ్యాణ్ కుమార్ సంగీతం సమకూర్చారు. గతేడాది సినీ గాయకురాలు మంగ్లీతోపాటు ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, భూమన అభినయ్ ఆలపించిన గంగమ్మ పాటలకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చాయి. ఈ ఏడాది కూడా పాటలు భక్తులను అలరించేలా రూపొందించినట్లు తెలిపారు. జాతరను వైభవంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దేవదానం, తొండమల్ల పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఏ సమయానికి ఎంత పోలింగ్ శాతం అంటే..
నెల్లూరులోని సెయింట్ జోసఫ్స్ స్కూల్లో.. సాక్షి ప్రతినిధి నెల్లూరు: సార్వత్రిక సమరంలో సింహపురి ఓటెత్తింది. జిల్లాలో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల్లోపు క్యూల్లో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశాన్ని కల్పించారు. కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అక్కడక్కడా స్వల్ప చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఉదయం ఆరు గంటలకే క్యూల్లో ఓటర్లు బారులుదీరారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా తరలివచ్చారు. ఏ క్యూలో చూసినా మహిళలే అధికంగా కనిపించడం విశేషం. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు కదిలారు. మరోసారి ఫ్యాన్ జోరే.. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సరళిని పరిశీలిస్తే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అంతర్గత సర్వేల్లోనూ ఇదే అంశం స్పష్టమైందనే విషయం తెలుస్తోంది. ప్రధానంగా పల్లెల్లో పోలింగ్ శాతం పెరగడంతో పాటు మహిళలు, వృద్ధులు బారులుదీరి ఓటేయడం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. మరోసారి సంక్షేమానికే మహిళామణులు జై కొట్టారని ఎగ్జిట్ పోల్స్ చెప్తుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఖుషీఖుషీగా ఉన్నారు. దాడులకు తెగబడిన పచ్చ పార్టీ ● కోవూరు నియోజకవర్గంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. పోలింగ్ సరళి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేక అల్లర్లు సృష్టించేందుకు యత్నించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలన నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెంలోని అమ్మవారితోపు పోలింగ్ బూత్ వద్దకు వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటర్ల దాహార్తిని తీర్చేందుకు గానూ తన వాహనంలో ఉన్న వాటర్ బాటిళ్లను ఇవ్వడాన్ని నేరంగా భావించిన టీడీపీ మూకలు రెచ్చిపోయి ఆయనపై దాడికి యత్నించాయి. పోలీసులు సకాలంలో చేరుకొని వీరిని చెదరగొట్టారు. ● ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురంలో టీడీపీ నేత మెట్టుకూరు చిరంజీవిరెడ్డి తన అనుచరులను వెంటేసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్లడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. దీంతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. ● అల్లూరులో పచ్చ పార్టీ శ్రేణులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ నేతకు చెందిన వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పుబెట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ● కావలి నియోజకవర్గంలోని ముసునూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కదల్లేని స్థితిలోనూ ఓటేసేందుకు.. -
వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ ఖాయం
● పార్టీపై జిల్లా ప్రజల ఆదరణ మరువలేనిది ● జిల్లాలో రౌడీయిజాన్ని అణగదొక్కుతాం ● పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు లోక్సభ, దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినగర్లోని తన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు తదితరులతో కలిసి విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడారు. అధిక పోలింగ్ శాతం నమోదవ్వడం ప్రభుత్వానికి వ్యతిరేకమంటూ కొందరు మాట్లాడుతున్నారని, అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రాష్ట్రంలోని 87 శాతానికిపైగా కుటుంబాలు సంక్షేమ పథకాలను అందుకున్నాయని, వీరందరూ తమ పార్టీకే ఓటేశారని తెలిపారు. డబ్బుతోనే రాజకీయాలు చేసేందుకు టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి యత్నించారని ఆరోపించారు. లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో డబ్బులను ఆయన భారీగా పంచారని విమర్శించారు. జిల్లాలోని అన్ని సీట్లను తామే గెలవబోతున్నామని.. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణపై ఖలీల్ అహ్మద్ గెలవబోతున్నారని చెప్పారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బులను పంచిందని, అయితే తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేశారని కొనియాడారు. ఓటింగ్ శాతం పెరగడం సంతోషం జిల్లాలో ఓటింగ్ భారీగా నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తమ పార్టీని ప్రజలు గెలిపిస్తున్నారని తెలిపారు. జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి, రూప్కుమార్యాదవ్ రౌడీయిజాన్ని సహించబోమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నారాయణ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. అనంతరం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. విజయసాయిరెడ్డి వచ్చాక జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ..
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ సోమవారం పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు వివరాలు ఆరాతీశారు. నిత్యం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా డీఎస్పీ స్థాయి అధికారులను, సిబ్బందిని నియమించామన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తినా దానిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అదనపు ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు తరచూ సందర్శించాలని ఆదేశాలిచ్చామన్నారు. పోలీస్ సిబ్బంది వృద్ధులు, బాలింతలు, మహిళలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడ్పడ్డారన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారు తప్ప ఇంకెవరూ ఉండకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ● జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. సోమవారం ఆయన నెల్లూరులోని డీకేడబ్ల్యూ, వీఆర్ లా, పీజీ కాలేజీ, స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్సార్ మున్సిపల్ హైస్కూల్, ముత్తుకూరు సర్కిల్ వద్ద హైస్కూల్, కొండాయపాళెం హైస్కూల్ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. వివాదాలు జరగకుండా చూడాలని, క్యూలైన్లలోనే ఓటర్లను పంపాలన్నారు.్శ భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేశారని వెల్లడించారు. -
ఉదయం నుంచే పోటెత్తి..
ఓట్లు వేసేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలు కట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ జరిగింది. మాక్ పోలింగ్ అనంతరం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వృద్ధులు, మహిళలు తొలి గంటలోనే ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున విచ్చేశారు. వృద్ధులు, దివ్యాంగులు కేంద్రాల్లోకి వెళ్లేందుకు పోలీస్ సిబ్బంది చేయూతనిచ్చారు. కొందరు కేవలం ఓటర్ స్లిప్స్ తీసుకురాగా ఓటర్ లేదా ఏదైనా గుర్తింపుకార్డు తీసుకు రావాలని సిబ్బంది చెప్పడంతో వెనక్కి వెళ్లారు. – సాక్షి నెట్వర్క్ -
విజయసాయిరెడ్డిపై దాడికి యత్నం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రేబాల గ్రామ పంచాయతీ పరిధిలోని అమ్మవారితోపు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఆయన బయటకు వచ్చే సమయంలో క్యూలైన్లో ఉన్న కొందరు మహిళలు దాహం వేస్తోందని, తాగునీరు కావాలని కోరగా విజయసాయిరెడ్డి తన కారులో ఉన్న వాటర్ బాటిళ్లను వారికి అందజేశారు. ఇదే సమయంలో అక్కడున్న టీడీపీ నాయకుడు శివరామకృష్ణారెడ్డి వాటర్ బాటిళ్లు ఎందుకు ఇస్తున్నావు?, వారితో ఎందుకు మాట్లాడుతున్నావని విజయసాయిరెడ్డితో దురుసుగా ప్రవర్తించాడు. తాను వారితో మాట్లాడలేదని, తాగునీరు అడిగితే అందించానని చెబుతున్నా వినకుండా మీదకు వెళ్లి నెట్టేసి దాడికి యత్నించాడు. విజయసాయిరెడ్డి ఆ సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై దాడులకు తెగబడుతున్నారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. బుర్రాను అడ్డుకుని.. ఉలవపాడు: వైఎస్సార్సీపీ కందుకూరు అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్పై టెంకాయచెట్లపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బుర్రా సోమవారం కరేడు పంచాయతీ టెంకాయచెట్లపాళెం గ్రామంలోని బూత్ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు బంధువులు సుధాకర్, నాయుడు తమ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. బుర్రా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన్ను నెట్టేశారు. పడబోతున్న సమయంలో గన్మెన్లు పట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసుల సాయంతో బుర్రా బూత్ను పరిశీలించి బయటకు వచ్చారు. తదనంతరం పెదపట్టపుపాళెం, చాకిచర్ల, ఉలవపాడులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కాగా ఉలవపాడు పంచాయతీ పరిధిలోని రాజుపాళెంలో మానసిక వికలాంగుడిని ఓటుకు తీసుకెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకులతో గొడవకు దిగారు. -
తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యకాండ
అల్లూరు: మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. మండలంలోని బీరంగుంటలో బీభత్సం సృష్టించారు. బాధితుడు బీరంగుంట ఉప సర్పంచ్ గుమ్మడి సాయిచరణ్ కథనం మేరకు.. సోమవారం ఉదయం ఆ ఊరిలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తుండగా సాయిచరణ్ వారించాడు. దీంతో అతడిని తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేశారు. ఒంటరిగా వెళ్తుండగా దాడి చేయడంతో సాయిచరణ్ అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం సమయంలో అతను తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తోడుగా రావాలని అల్లూరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులను పిలిచాడు. వారు వచ్చాక పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్తున్న తరుణంలో తిరిగి టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేసి హరీష్ అనే యువకుడిపై రాడ్తో దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడగా నేతలు వెంటనే అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే.. ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. హరీష్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కావలి ముసునూరులో, అల్లూరు రామకృష్ణా కాలేజీ వద్ద, బీరంగుంట గ్రామంలో దాడులకు పాల్పడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ప్లాన్ ప్రకారం కావలి ముసునూరులో మహేష్, కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డిపై, బీరంగుంట గ్రామంలో గుమ్మడి సాయిచరణ్, హరీష్ దాడులు చేశారన్నారు. కావ్య కృష్ణారెడ్డి ఎలాంటి దుర్మార్గుడో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అతనికి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నెమాల సుకుమార్రెడ్డి, నాయకులున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ మూక దాడి కారు అద్దాలు ధ్వంసం ఒకరికి తీవ్రగాయం వైఎస్సార్సీపీ ఏజెంట్పై దాడి సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద సోమవారం వైఎస్సార్సీపీ ఏజెంట్ పాణెం సుధీర్ కుమార్పై అదే గ్రామానికి బ్రహ్మయ్య, సుధీర్ దాడి చేసి గాయపరిచారు. పోలింగ్ సమయంలో టీడీపీకి ఓటేయాలని ఆ పార్టీ కార్యకర్తలు మహిళలకు చెబుతున్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన తెలుగు తమ్ముళ్లు దాడికి పాల్పడ్డారు. దీంతో సుధీర్ కుమా ర్ గాయపడగా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రగతి సాధకుడికే మా ఓటు
● గత ఐదేళ్లలో జిల్లాలో ఇదీ పరిస్థితి ● సోమశిల – కండలేరు వరద కాలువ ఆధునికీకరణ ● సంగం, నెల్లూరు బ్యారేజీల పూర్తి ● తుది దశకు రామాయపట్నం పోర్టు ●నెల్లూరులో ఫ్లయ్ఓవర్ ఏర్పాటు ● కోవిడ్ సంక్షోభంలోనూ.. అందరికీ సంక్షేమం ● పేదలకు చేరువైన విద్య, వైద్యం ● నాడు – నేడుతో స్కూళ్లు బాగు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఘడియలు రానే వచ్చాయి. జిల్లా అంతటా మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. పండగ వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చైన్నె లాంటి నగరాలకు వలస వెళ్లిన వారు జగనన్నకు ఓటువేసేందుకు సొంత గ్రామాలకు ఉత్సాహంగా చేరుకున్నారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, పారిశ్రామిక ప్రగతి.. ఎన్నో పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ ఓట్లు వేసి గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అంతంతమాత్రంగా అందిన సంక్షేమ పథకాలు.. పడకేసిన ప్రాజెక్టులు.. నిధుల దోపిడీయే లక్ష్యంగా చేపట్టిన తూతూమంత్రపు పనులతో ప్రజల అష్టకష్టాలు పడ్డారు. ఈ క్రమంలో 2019లో వైఎస్సార్సీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా దశ, దిశ మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులు సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తిచేశారు. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులను వెచ్చించి పూర్తి చేయడంతో అన్నదాతల మో ముల్లో ఆనందం చిగురించింది. మ హిళా భ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాల లబ్ధిని వారి ఖా తాల్లో జమచేయడంతో ఆర్థిక స్వావలంబన చే కూరింది. ఈ క్రమంలో సోమవారం జరగనున్న ఎ న్నికల్లో సంక్షేమ సారథికి ఓటేస్తే అభివృద్ధిలో జిల్లా మరింత పరుగులు తీస్తుందనే భావన అందరిలో వ్యక్తమవుతోంది. జిల్లా అభివృద్ధికి అడుగులు జిల్లా అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్మోహన్రెడ్డి అడుగులేశారు. జిల్లాలోని రైతన్నల సంక్షేమం కోసం పలు ప్రాజెక్టులకు దివంగత సీఎం వైఎస్సార్ రూపకల్పన చేశారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు వీటిని విస్మరించారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి వీటిని జిల్లాకు సీఎం అంకితం చేశారు. భారీగా ఏర్పాటైన పరిశ్రమలు.. ఉపాధి అవకాశాలు.. అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా వాసుల మన్ననలను సీఎం చూరగొన్నారు. సాగునీటికి ఢోకా లేదు ● సోమశిల జలాలను 58 గ్రామాలకు అందించాలనే లక్ష్యంతో ఆనం సంజీవరెడ్డి సోమశిల లింక్ కెనాల్కు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో రూ.840.90 కోట్లకు గానూ ఇప్పటికే రూ.604.50 కోట్లను వెచ్చించారు. 62.38 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ● సోమశిల – కండలేరు వరద కాలువ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం రూ.960 కోట్లను మంజూరు చేసింది. సోమశిల నుంచి కండలేరు రిజర్వాయర్ వరకు పెన్నా వరద నీటిని తరలించేందుకు నిర్దేశించిన ఈ కాలువ ఆధునికీకరణ ద్వారా రోజుకు రెండు టీఎంసీలను తరలించొచ్చు. 45 కిలోమీటర్ల పొడవు కలిగిన కాలువకు పను 30 శాతం మేర పూర్తయ్యాయి. ● వరదల కారణంగా సోమశిల జలాశయం వద్ద దెబ్బతిన్న ఆప్రాన్ ప్రాంత అభివృద్ధికి రూ.117 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. సోమశిల క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని గతంలో కంటే పెంచినా జలాశయ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. ● మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేలా ఉత్తర కాలువ ఆధునికీకరణ కోసం రూ.960 కోట్లను కేటాయించారు. సుమారు 101 కిలోమీటర్ల పొడవు గల ఉత్తర కాలువ నీటి సామర్థ్యాన్ని 350 నుంచి 700 క్యూసెక్కులకు పెంచేలా కాలువను ఆధునికీకరిస్తున్నారు. పనులు పూర్తయితే 1.1 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరగనుంది. ఫిషింగ్ హార్బర్తో హ్యాపీ ● మత్స్యకారుల సంక్షేమం కోసం బోగోలు మండలం జువ్వలదిన్నెలో సుమారు రూ.289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. దీని ద్వారా ఏటా అదనంగా 41 వేల టన్నుల మత్స్య సంపద లభించడంతో పాటు పరిశ్రమల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం మత్స్యకారులకు ఏర్పడింది. ● కృష్ణపట్నం పోర్టు సమీపంలో నేలటూరు – పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్లతో మినీ ఫిషింగ్ హార్బర్ను నిర్మించనున్నారు. పోర్టు రయ్..రయ్ బ్యారేజీలు అంకితం నెల్లూరు బ్యారేజీ ద్వారా సర్వేపల్లి, జాఫర్సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో గల 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు నీరు సమృద్ధిగా అందుతుంది. 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా సాగు, తాగునీరందుతుంది. ఈ బ్యారేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. సంగం బ్యారేజీ ద్వారా 3.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ మరణానంతరం ఈ పనులను పట్టించుకున్న నాథుడే లేరు. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టును ప్రాధాన్య క్రమంలో ప్రభుత్వం చేర్చి రూ.131.12 కోట్లను వెచ్చించి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు,. రిటైనింగ్ వాల్స్కు భారీగా నిధులు నగరంలోని 0.6 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్ల వరకు వెళ్లే సర్వేపల్లి కాలువకు రక్షణ గోడల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.99.95 కోట్లను మంజూరు చేసింది. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. నగరంలోని జాఫర్సాహెబ్ రక్షణ గోడల నిర్మాణ పనుల కోసం రూ.39.87 కోట్లను మంజూరు చేశారు. పెన్నా ఒడ్డున వరద ఉధృతి నుంచి రక్షణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.94.59 కోట్లను మంజూరు చేశారు. 850 ఎకరాల్లో రూ.3743 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు. ఇందులో నాలుగు బెర్తులు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి.. పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది. పోర్టు ఆధారిత, ఇతర పరిశ్రమల స్థాపనకు 3700 ఎకరాలను కేటాయించారు. తద్వారా 50 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గృహాలతో ఖుషీఖుషీ నవరత్నాలు – పేదలందరికి ఇళ్లు పథకం ద్వారా జిల్లాలో 58 వేల గృహాలు మంజూరయ్యాయి. జిల్లాలోని 282 లేఅవుట్లలో గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ నెల్లూరులోని రామలింగాపురం కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యలు తరచూ ఉత్పన్నమయ్యేవి. ఈ తరుణంలో 810 మీటర్ల పొడవున ఫ్లయ్ఓవర్ నిర్మాణానికి సంకల్పించారు. రూ.41.88 కోట్లతో దీన్ని పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తొలగించారు. నిరంతర విద్యుత్ వెలుగులు జిల్లాలోని నేలటూరులో దామోదరం సంజీవయ్య 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా 800 మెగావాట్లతో మూడో యూనిట్ను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. -
No Headline
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఆర్వో కార్యాలయాల వద్ద ఈవీఎంలు, వీవీ ప్యాట్స్, ఎన్నికల సామగ్రిని అధికారులు ఆదివారం పొందారు. అనంతరం వారికి కేటాయించిన ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని, వెంకటాచలంలోని క్యూబా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు సర్వం సిద్ధం -
ప్రగతిధామం.. సంక్షేమ జపం
● కందుకూరులో అభివృద్ధి కొత్త పుంతలు పట్టణంలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనం ● సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రాళ్లవాగుపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ● ఆహ్లాదకరంగా పార్కుల అభివృద్ధి ● రూ. 26 కోట్ల ప్రత్యేక నిధులు, మరో రూ. 28 కోట్ల జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధుల ఖర్చు ● నియోజకవర్గంలో 5.71.538 మందికి సంక్షేమ పథకాలు ● సంక్షేమానికి డీబీటీ కింద రూ.1,106.64 కోట్లు ● నాన్ డీబీటీ ద్వారా 307.09 కోట్ల లబ్ధి కందుకూరు: అభివృద్ధిలో కందుకూరు ఆదర్శ మున్సిపాలిటీగా నిలుస్తోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటయ్యా యి. పట్టణంలోని ప్రతి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు ఏర్పాటయ్యాయి. ఆహ్లాదం పంచుతూ పార్కులు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో పట్టణానికి కొత్త సొబగులు అద్దెందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వీటితో మున్సిపల్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు వంటివి ఏర్పాటయ్యాయి. 2022 జూలై 20 రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.26 కోట్ల ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పట్టణంలో 174 పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల విలువ చేసే 61 పనులను కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. ప్రధాన రోడ్లు అయిన కోవూరు, పామూరు రోడ్డు ప్రాంతాల్లో భారీ డ్రైనేజీ వ్యవస్థలను నిర్మించారు. వీటి నిర్మాణంతో వరద, మురికి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగే పరిస్థితి ఏర్పడింది. పైగా ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ రావడంతో ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జనార్దనకాలనీ, ఉప్పుచెరువు, సాయినగర్, నాంచారమ్మ, కొస్టాలు, కోటారెడ్డినగర్, గుర్రంవారిపాళెం తదితర కాలనీల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి ఏర్పాటు చేశారు. జరల్ఫండ్, ఆర్థిక సంఘం నిధులతో.. మున్సిపాలిటీ జనరల్ ఫండ్, 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు రూ.25.83 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో రూ.10.13 కోట్లతో రోడ్లు, రూ.6.26 కోట్లతో డ్రైనేజీలు, రూ.4.80 కోట్లతో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించారు. మరో రూ.3 కోట్లతో క్లబ్ రోడ్డు నుంచి ఆదియేంద్ర కాలనీ వరకు భారీ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. మరో రూ. 2 కోట్లతో రాళ్లపాడుపై చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు దాదాపు 70 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్న కందుకూరులో వినోదానికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. రూ. 40 లక్షలతో ముత్యాలకుంట వద్ద ఉన్న చిల్డ్రన్స్ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దలు, పిల్లలు కలిసి సరదాగా కాసేపు సేద తీరేందుకు, పిల్లలు ఆటలు ఆడేందుకు ఈ పార్కు ఎంతో ఉపయోగకరంగా మారింది. దివి లింగయ్యనాయుడు పార్కు అభివృద్ధి చేశారు. పట్టణంలోని మరికొన్ని పార్కుల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ. 25 కోట్లతో అమృత్ పథకం పనులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ. 25.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏరియాల వారీగా రోజుకు ఒక గంట చొప్పున నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటు ఉన్న 7 ఎంఎల్డీ (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్ మాత్రమే ఉండడం నిరంతరం సరఫరా చేయడం కుదరడం లేదు. దీంతో కొత్తగా అమృత్ పథకం కింద మరో 5 ఎంఎల్డీ ప్లాంట్ను నిర్మించి 24 గంటలు నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కుంటల అభివృద్ధి చేపట్టనున్నారు. పట్టణ వైద్యానికి దన్ను అర్బన్ హెల్త్ సెంటర్లు పట్టణంలోని శివారు ప్రాంతాల్లో నివశించే పేదలకు సకాలంలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి రెండు అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. మొత్తం రూ. 1.77 కోట్ల ఖర్చుతో వీటిని నిర్మాణం చేశారు. వీటిలో ఒకటి కోటారెడ్డి నగర్లో, మరొకటి జనార్దన కాలనీలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పట్టణ పేదలకు ప్రభుత్వ వైద్యసేవలు మరింత దగ్గర అవుతున్నాయి. ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ. 7 కోట్లతో అధునాతన భవనాలను నిర్మించారు. ఇలా పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సంక్షేమానికి పెద్ద పీట రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాజకీయ పార్టీలు, కుల,మత, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా చేసిన సంక్షేమంతో పేద, మధ్య తరగతి ప్రజలు జీవనోపాదులు మెరుగపడ్డాయి. తద్వారా కొనుగోలు శక్తి పెరగడంతో వ్యాపారాభివృద్ధి సైతం మెరుగు పడింది. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,28,913 మంది ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 5.71.538 మందికి డీబీటీ, నాన్డీబీటి కింద సంక్షేమ పథకాల ద్వారా 1,413.75 కోట్ల మేర అందించింది. ఉదయగిరి: నియోజకవర్గంలోని ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఈ మెట్ట ప్రాంతానికి గండిపాళెం రిజర్వాయరు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. రాళ్లపాడు, మోపాడు, నక్కలగండి రిజర్వాయర్ల ద్వారా కూడా కొంత సాగునీరు అందుతుంది. ఎక్కువగా వరి, పొగాకు, మినుము, జామాయిల్, నిమ్మ, బత్తాయి, మామిడి తోటలు కూడా అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలో యాభై వేలమంది వరకు రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రైతన్న సంక్షేమానికి: ఉదయగిరిలో రూ.1.5 కోట్ల వ్యయంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తెచ్చారు. రూ.19.62 కోట్లతో 95 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ప్రజల చెంతకు పాలన : ఎనిమిది మండలాల పరిధిలో 143 గ్రామ పంచాయతీలు 400 పైగా గ్రామాలు ఉన్నాయి. గతంలో పల్లె వాసులు చిన్న పనికి సైతం వ్యయ ప్రయాసలకు ఓర్చి మండల కేంద్రాలకు వెళ్లాలి. అయితే ఈ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన జనం చెంతకు వచ్చింది. రూ.36.60 కోట్లు వ్యయంతో 95 సచివాలయాలు నిర్మించి అన్నీ సేవలు ఇక్కడ నుంచే అందిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ : గతంలో మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పల్లె వాసులకు వైద్య సేవలు గగనంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చారు. 79 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను రూ.13.83 కోట్లు ఖర్చు చేసి నిర్మించి గ్రామస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో వైద్యులు ఇంటి వద్దకే వైద్యలు అందిస్తున్నారు. రూ.760 కోట్లతో జాతీయ రహదారులు : ఉదయగిరి నియోజకవర్గ దశాబ్దాల కల జాతీయ రహదారులు. అరవై ఏళ్ల నుంచి ఎదురు చూపులకు చరమగీతం పాడుతూ వైఎస్సార్పీపీ ప్రభుత్వ పాలనలో రూ.760 కోట్లతో కావలి–సీతారామపురం, సింగరాయకొండ–సీతారామపురం రెండు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది. తద్వారా బీడు భూముల ధరలకు రెక్కలోచ్చాయి. అతి త్వరలో పూర్తయ్యే ఈ జాతీయ రహదారులు ద్వారా రాష్ట్రంలో ఎక్కడకై నా అతి వేగంగా చేరుకునే అవకాశం కలిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ’గ్రీన్ ఫీల్డ్’ ఎక్స్ప్రెస్ హైవే సీతారామపురం మీదుగా వెళ్తొంది. రూ.53.40 కోట్లు ఖర్చు చేసి పలు గ్రామీణ రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు. నెరవేరిన సొంతింటి కల: నియోజకవర్గంలోని 194 లేఅవుట్లు ఏర్పాటు చేసి 6400 మందికి పక్కా ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో చాలా వరకు పనులు పూర్తికాక, మరికొన్ని చోట్ల పనులు చకచకగా సాగుతున్నాయి. లేఅవుట్ల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మాణం చేపట్టారు. స్థలంతో కలిపి ఒక్కొక్కరికి సగటున రూ.8 లక్షలు మేర లబ్ధి చేరుకూరుతోంది. అంటే రూ.480 కోట్లు అస్తి అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. నాడు–నేడుతో మారిన పాఠశాలల రూపు రేఖలు : నాడు–నేడు ద్వారా శిథిలవస్థకు చేరుకున్న పాఠశాలల రూపు రేఖలు మారాయి. ఫేజ్–1, ఫేజ్–2 ద్వారా రూ.125.04 కోట్లు ఖర్చు చేసి సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులు చక్కగా చదువుకునే వాతావరణం కల్పించారు. పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభించి భవనాలు కట్టించారు. ఉదయగిరి ట్యాంక్బండ్ : నియోజకవర్గ ముఖ చిత్రం మార్చే ఉదయగిరి ట్యాంక్ బండ్ పనులు రూ.9 కోట్ల వ్యయంతో సాగుతున్నాయి. ఇది పూర్తయితే పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు అందుబాటులోకి వస్తోంది.నగరానికి కొత్త రూపు పట్టణం రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రోడ్లకు కొత్త రూపు తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో రూ. 2 కోట్ల ఖర్చుతో ఓవీ రోడ్డులోని క్లబ్ రోడ్డు నుంచి ఎస్బీఐ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్ ఎదురు పామూరు రోడ్డు జంక్షన్ను సుందరంగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇవి పూర్తయితే పట్టణానికి కొత్త అందాలు వచ్చి చేరుతాయని అధికారులు భావిస్తున్నారు. -
ఐదేళ్లలో ప్రగతి పరుగు
● రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు ● సంక్షేమ పథకాల ద్వారా మరో రూ.1450 కోట్లు ● రూ.760 కోట్లతో జాతీయ రహదారులు ● ఉపాధి అవకాశాలు పెరగడంతో తగ్గిన వలసలు దశాబ్దాలుగా వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గం దశను ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చేసింది. అరవై ఏళ్లుగా సాధ్యం కానీ ఎన్నో పనులను, ఎంతో అభివృద్ధిని ఐదేళ్లలో సాకారం చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం, ఉదయగిరి ట్యాంక్బండ్ నిర్మాణం, అగ్రిల్యాబ్, వ్యవసాయ గోదాములు, సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు భవనాలు ఇలా అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే సుమారు రూ.1000 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయి. మరో రూ.1,450 కోట్ల మేర సంక్షేమ పథకాలు అందాయి. -
ప్రజాతీర్పునకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి సర్వం సిద్ధమైంది. నెలన్నర క్రితం ఎన్నికల రణరంగం ప్రారంభం కాగా, కురుక్షేత్రాన్ని తలపించే రీతిలో ప్రధాన పార్టీలు ప్రచారాలు.. వ్యూహ.. ప్రతివ్యూహాలతో ముందుకుసాగాయి. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్సభ స్థానం ఉంది. ఇందులో సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి లోక్సభ పరిధిలోకి వస్తుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే తాము ఎవరికి ఓటేయాలనుకుంటున్నామో ప్రజలు డిసైడయ్యారు. ప్రజా ప్రభుత్వంవైపే మొగ్గు.. విశ్వసనీయత.. మోసం మధ్య ఈ ఎన్నికల పోరు జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన టీడీపీని తాము విశ్వసించేదిలేదని.. ప్రజా ప్రభుత్వమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తమ ఓటని ప్రజలు పేర్కొంటున్నారు. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేసి.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగనన్నే మరోసారి ముఖ్యమంత్రి కావాలనే భావన బలంగా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల రోజు రానే వచ్చింది. ఎండల తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలతో హోరెత్తించారు. తమ పార్టీల మేనిఫెస్టోలు.. లక్ష్యాలను వివరిస్తూ ఓటర్లను కలుసుకొని తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో సోమవారం నిక్షిప్తం చేయనున్నారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ నేడు ఏర్పాట్లు పూర్తి కేంద్రాలకు తరలిన సిబ్బంది -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి
● ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నెల్లూరు(క్రైమ్): నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటాచలం, నెల్లూరు పరిధిలోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం బందోబస్తు విధులకు హాజరైన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారదర్శకత, నిష్పక్షపాతమే ఆయుధాలని.. వీటితోనే ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. శాంతియుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో విధులు నిర్వర్తించే మొబైల్ పార్టీలు, క్యూఆర్టీ ఫోర్సుల్లోని అధికారుల ఫోన్ నంబర్లను సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు కేంద్ర బలగాలను కేటాయించామని తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement